24, మే 2026, ఆదివారం

చేపల పెంపకం పై మూడు రోజుల శిక్షణ శిక్షణ

 నేషనల్ ఫిషరీస్ ఆధ్వర్యంలో ఈనెల 28 29 30 తేదీలలో మంచిర్యాలలో ఏర్పాటు..

మత్స్యకారులను రైతులను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 28 29 30 తేదీలలో మత్స్యకారులకు చేపల పెంపకం పై ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన 50 మంది మత్స్యకారులను ఎంపిక చేశారు. మత్స్యకారులకు శాస్త్రీయ పద్ధతుల్లో చేపల పెంపకం పై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు. చేపల పెంపకం ఉత్పాదకను ఎలా పెంచాలి? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. వీటితోపాటు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కొర్రమీను/స్నేక్ హెడ్ పెంపకం, యాజమాన్య పద్ధతులపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తారు. జాతీయస్థాయి మత్సరంగ శాస్త్రవేత్తలు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అధికారులు హాజరై మత్స్యకారులు రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తారు. ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని మత్స్యకారులు రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని అధికారులు కోరారు.

తిరుపతిలో పాలేకర్ శిక్షణ శిబిరం

 ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఐదు రోజుల శిక్షణ శిబిరం ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించనున్నారు.

ఈ ఐదు రోజుల రెసిడెన్షియల్ రైతు శిక్షణ శిబిరం జూన్ 10 నుండి 14వ తేదీ వరకు జరగనున్న ది. పాలేకర్ ఆంగ్ల ప్రసాద్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఉంటుంది. స్వచ్ఛంద సేవకులు డాక్టర్ గంగాధర్ విజయ్ రామ్, పారిశ్రామిక వేత్త రామలింగారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని తిరుపతి చంద్రగిరి రోడ్ లోని ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు.హాజరయ్యే రైతులకు హాస్టల్ హెచ్ లో వసతి కల్పించ నున్నారు. గ్రామ స్వరాజ్యం, విష ముక్త, రోగ ముక్త ఆహారోత్పత్తి లక్ష్యంగా సుభాష్ పాలేకర్ కృషి SPK పద్ధతిలో ఇమిడి ఉన్న అన్ని అంశాలపై పాలేకర్ రోజుకు 12 గంటల పాటు లోతుగా శిక్షణ ఇస్తారు.5 రోజులు భోజన,వసతికి 1500 రూపాయలు చెల్లిస్తే చాలు.ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పని సరి.

పూర్తి వివరాలకు 96669 11116,94924 84003,93475 78819 ఫోన్ నెంబర్ లలో సంప్రదించ ాలని తెలిపారు.

21, మే 2026, గురువారం

నిమ్మ దిగుబడి పెరగాలంటే

 వేసవికాలంలో నిమ్మ పండ్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెరటి తోట లోని నిమ్మ చెట్టు పుష్కలంగా కాయలు కాయాలంటే.. సరైన పోషణ, సంరక్షణ ముఖ్యం. ఎండల తీవ్రత పెరిగినపుడు నిమ్మ చెట్టు కు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. కాయలు రాలకుండా మంచి దిగుబడి రావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి.

ఉష్ణోగ్రత లు పెరిగినపుడు భూమిలో తేమ ఆరిపోకుండా చూసుకోవాలి. నేల పూర్తిగా ఎండిపోక ముందే నీరు పెట్టాలి.ఐతే మరీ ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఉదయం ఎండ రాకముందు ,సాయంత్రం ఎండ తగ్గిన తర్వాతే నీరు పెట్టడం మంచిది. దీని వల్ల వేర్లు చల్లగా ఉంటాయి. ఎండ దెబ్బ నుండి వేర్లను కాపాడటానికి మొక్కల మొదళ్ల దగ్గిర మల్చింగ్ చేయడం మంచిది.చెట్టు మొదలు చుట్టూ ఎండు గడ్డి , ఎండిన ఆకులు , కొబ్బరి పీచుతో 3-4 అంగుళాల మేర కప్పితే..వేర్లు దెబ్బ తినకుండా ఉంటాయి. నేలలో తేమ ఎక్కువ సేపు ఉంటుంది కూడా.. నేలకు తగిలేలా ఉండే కింది కొమ్మలను కత్తిరించాలి. దీని వల్ల తెగుళ్ళ ఉధృతి తగ్గుతుంది. ఇక నిమ్మలో పూత రాలకుండా ఉండటానికి , కాయల పరిమాణం పెరగడానికి .. ఒక లీటర్ నీటిలో 2గ్రా బోరాన్ ,5 గ్రా జింక్ సల్ఫేట్ ను కలిపి పిచికారీ చేయాలి.ఇంట్లో మిగిలిన పుల్లని పెరుగుతో మజ్జిగ చేసి , నిమ్మ చెట్టు మొదట్లో పోయాలి.చెట్టుపై పిచికారీ చేసినా.. శిలీంధ్ర తెగుళ్లు తగ్గుతాయి..

15, మే 2026, శుక్రవారం

ఈ - ట్రాక్టర్ రైతులకు ఉపయోగకరము

 


తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సి ఎస్ ఐ ఆర్ సీఎం ఈ ఆర్ ఐ ప్రిమాఈటీ 11 అనే స్వదేశీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను అభివృద్ధి చేసింది గురువారం హైదరాబాదులోని ఎన్జీఆర్ఐ లో ఈ ట్రాక్టర్ ను ప్రమోట్ చేయడానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐఏసిటి డైరెక్టర్ డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి ఎం జి ఆర్ ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్ సీఎం ఈఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ నరేష్ చంద్ర మురుములతో కలిసి ట్రయల్ రన్ రోడ్ షో న ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జింగ్ ద్వారా నడిచే ఏ ట్రాక్టర్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు పొలాలలో ఈ ట్రాక్టర్ సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు తక్కువ వైబ్రేషన్ ఉండడం వల్ల మహిళలు సైతం సునాయాసంగా నడపగల వాహనం ఇది అని వివరించారు 26 హెచ్పీ సామర్థ్యం గల ఈ వాహనంలో 90 శాతం వరకు స్వదేశీ విడిభాగాలు ఉన్నట్లు తెలిపారు

1, మే 2026, శుక్రవారం

నిషేధిత పురుగుమందులను ఆన్లైన్లో విక్రయించవద్దు

 నిషేధిత పారాక్వాట్ సహా ఇతర పురుగుమందు లేవీ ఆన్లైన్లో విక్రయించరాదని ఈ కామర్శ సంస్థ అయిన అమెజాన్ ను తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఆదేశించింది .గురువారం కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు ,అమెజాన్ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు .ఈ కామర్స్ సంస్థల ద్వారా పురుగుమందుల విక్రయాలు, దానివలన ఏర్పడుతున్న అనర్ధాలపై చర్చించారు .

అనంతరం చైర్మన్ మాట్లాడుతూ మానవ ఆరోగ్యానికి హానికరమైన విషపూరిత పురుగుమందులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయని, వాటిని ఆన్లైన్లో విక్రయించవద్దని అమెజాన్ సంస్థ ప్రతినిధులకు సూచించారు .దీనిపై అమెజాన్ ప్రతినిధులు స్పందిస్తూ వ్యవసాయ కమిషన్ సూచనలను పాటిస్తామని, తమ విక్రయాల జాబితా నుంచి నిషేధిత పురుగుమందులను తొలగిస్తామని చెప్పారు.

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

మైసూరులో కిసాన్ స్వరాజ్ సమ్మేళనం

 ఫిబ్రవరి 27 28 మార్చి ఒకటి తేదీలలో కర్ణాటకలోని మైసూరులో దక్షిణ భారత కిసాన్ స్వరాజ్ సమ్మేళనం జరగనుంది. కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ సహకారంతో అలయన్స్ ఫర్ సస్టైనబుల్ హోలిస్టిక్ అగ్రికల్చర్ ఆశా ఈ ఆరవ సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. రెండేళ్లకోసారి ఈ ఉత్సవం జరుగుతుంది .2022 లోను మైసూరులోని జరిగిన సమ్మేళనంలో తెలుగు రాష్ట్రాల నుండి 300 మంది పాల్గొన్నారు .పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతులు కార్యకర్తలు శాస్త్రవేత్తలు వినియోగదారులను ఒకచోట చేర్చి అఖిలభారత అనధికారిక పౌర స్వచ్ఛంద సేవకుల సమ్మేళనం ఇది .ప్రకృతి ,సేంద్రియ వ్యవసాయ పద్ధతులు రైతుల హక్కులు ,దేశీ వంగడాలు ,వ్యవసాయ సంస్కృతి కలల పరిరక్షణ లక్ష్యంతో చర్చగోస్టులు ,సదస్సులు నిర్వహిస్తారు .విత్తన సార్వభౌమత్వం ,గడ్డి మందులను తట్టుకునే జన్యు మార్పిడి పంటలు, కలుపు యాజమాన్యం వ్యవసాయంలో శ్రమశక్తి ,అడవి జంతువులతో పంటలకు ముప్పును తట్టుకుని నిలబడడం ఎలా? ఇలాంటి అంశాలపై లోతైన చర్చ జరుగుతుంది. 

పాల్గొనదలచిన వారు..

 ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. మూడు రోజులకు వసతి ,భోజనం అన్నీ కలిపి రైతులు విద్యార్థులకు 1500 రూపాయలు, మహిళా రైతులకు 800 రూపాయలు ఇతరులకు 2500 నుండి 3500.

 చివరి తేదీ ..

ఫిబ్రవరి 15 ,2026 .

ఇతర వివరాలు ..810 55 798 39 

ఇమెయిల్.. kisanswarajsammelan2026@Gmail.com

హైదరాబాదులో రైతు బడి అగ్రి షో

 రైతులకు సరికొత్త నూతన వ్యవసాయ యంత్ర పరికరాలు ఆధునిక సాగు పద్ధతులను పరిచయం చేసే లక్ష్యంతో రైతు బడి అగ్రి షో పేరుతో భారీ వ్యవసాయ ప్రదర్శన జరగనున్నది. హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఫిబ్రవరి 20 21 22 తేదీలలో ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు రాజేందర్ రెడ్డి తెలిపారు .తమ వ్యవసాయాన్ని నవీకరించుకోవాలి అనే   ఆలోచనతో ఉన్న రైతులు కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఈ షో నిర్వహిస్తున్నామన్నారు . 500కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని అనేక ప్రాంతాల నుంచి లక్ష మంది కి పైగా రైతులు ఈ కార్యక్రమాన్ని సందర్శించే అవకాశం ఉందని అన్నారు .

వివరాలకు 88971 19694.

www.rbagrishow.com

27, మార్చి 2024, బుధవారం

పాల దిగుబడి కి ఇలా చేస్తే మేలు

 రైతులకు వ్యవసాయంతో పాటు పాడి అభివృద్ధి చెందితేనే గిట్టుబాటుగా ఉంటుంది దీనికి చిన్న చిట్కాలు పాటిస్తే పశువులకు పోషకాలు అందడంతో పాల ఉత్పత్తి పెరుగుతుందని పశువైద్యాధికారి సురేష్ తెలిపారు పచ్చిగడ్డి వెండి గడ్డిని కలిపి ఇవ్వాలి. పచ్చి గడ్డిలో 90 శాతం నీరు ఉంటుంది అదే ఎండు గడ్డిలో 10% నీరు ఉంటుంది రెండు భాగాలు పచ్చి ఒక భాగం వెండి గడ్డి కలిపి అందించాలి పాలు పితికిన తర్వాత మేత వేయాలి దాదాపుడిగా అయినా లేదా నాన్న పెట్టి అయినా ఇవ్వవచ్చు అయితే నానబెట్టడం వల్ల నమ్మడానికి జీర్ణం కావడానికి సౌకర్యంగా ఉంటుంది ఆరు గంటల పాటు నానబెడితే మంచిది

22, మార్చి 2024, శుక్రవారం

కూరగాయల రైతులకు గ్లోబల్ అవకాశాలు

 ప్రణాళికలతో లాభాల సాగు ఎగుమతులపై దృష్టి పెట్టాలి సింజంట ఆసియా పసిఫిక్ విభాగాధిపతి నిశ్చింత భాటియా



తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ కూరగాయల రైతులకు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయని సరైన పద్ధతుల్లో సాగు శుద్ధి విధానాలను ఆలంపిస్తే వారు భారీ లాభాలు పొందుతారని ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించగలుగుతారని కూరగాయల విత్తన సంస్థ సింజంట ఆసియా పసిఫిక్ విభాగాధిపతి నిశ్చింత భాటి అన్నారు హైదరాబాద్ శివారులోని నూతనకల్లో తమ సంస్థ తరఫున ప్రపంచ స్థాయి మూడు అత్యాధునిక విత్తన ఆరోగ్య ప్రయోగశాల సీడ్ హెల్త్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరై హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఏమన్నారు అంటే

ప్రపంచ దేశాల్లో 70 శాతం మేర భారత్ లో 80 శాతానికి పైగా ప్రజలు కూరగాయల ఆహారాన్ని భోంచేస్తున్నారు ఆరోగ్యపరంగా కూరగాయల శ్రేష్టమైనవి వాటిని వినియోగించే వారిలో 90 శాతం మందికి అనారోగ్య సమస్యలు లేవు జంక్ ఫుడ్ తినేవారిలో 40 శాతానికి పైగా అధిక బరువు సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని అధ్యయనాలు వెల్లడించాయి నా ప్రణాళికతోనే కూరగాయల సాగును నిర్దిష్ట ప్రణాళికతో చేపట్టాలి విత్తన రకాలను ఎంచుకొని కాలానికి అనుకూలంగా పండించాలి పురుగుమందులు కొద్ది మోతాదులోని ఉపయోగించాలి కోత దశతో పాటు నిల్వ శుద్ధిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి మార్కెటింగ్ ఏకమతల పైన దృష్టి సారించాలి ఛత్తీస్గఢ్లోని రాయపూర్ రైతు ఎకరంలో 90 టన్నుల దాకా టమాటాను పండించార. దీని ద్వారా వాణిజ్య పంటల కంటే రెట్టింపు ఆదాయం వచ్చింది కరీంనగర్ కూరగాయల రైతులు లాభాలు గడిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి రైతుల్లో ఎక్కువమంది టమాటా సాగుతూ లబ్ధి పొందుతున్నారు ఇజ్రాయిల్ జర్మనీ తదితర విదేశాల్లోనూ కూరగాయల సాగుతూ రైతులు లాభాలను గడిస్తున్నారు

విత్తనాల నాణ్యత ప్రమాణికం సింజంటా భారత్ లోని అతిపెద్ద మూడు కూరగాయల విత్తన సంస్థల్లో ఒకటి ప్రపంచవ్యాప్తంగా 124 దేశాల్లోని 26 పంటలకు విత్తనాలను తయారుచేసి పంపిణీ చేస్తున్నాం తెలంగాణ ఏపీ లలో 160 విత్తన రకాలను విక్రయిస్తున్నాను. విత్తనాలను ఎక్కడికక్కడ స్థానిక రైతులతో సిద్ధం చేస్తున్నాము విత్తనాల నాణ్యతకే ప్రాధాన్యమిస్తున్నాం నిపుణులైన వారితో అన్ని రకాల జర్మినేషన్ పరీక్షలు నిర్వహించిన అనంతరమే మార్కెట్లో విక్రయిస్తున్నాం దేశంలో ఈ ఏడాది 11 మిలియన్ విత్తన ప్యాకెట్లను విక్రయించాము విత్తన రకాలపై ముందస్తు పరీక్షల కోసం అమెరికా నెదర్లాండ్స్ తో పాటు భారత్లో ల్యాబ్ను ఏర్పాటు చేశాం హైదరాబాద్ నూతనకల్లో ల్యాబ్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన విత్తన పరీక్షా కేంద్రాల్లో ఒకటి భారత్తో ఆసియా పసిఫిక్ మరియు వెలుపల సాగుదారులకు సేవలందిస్తుంది. విత్తన నాణ్యత ప్రమాణాల ద్వారా రైతులకు నమ్మకంతో పాటు లాభాలను అందించేందుకు కృషి చేస్తున్నాం అన్నారు

సాగు పెరిగింది గత ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కూరగాయల సాగు విస్తీర్ణం 10% మేరా పెరిగింది తక్కువ విస్తీర్ణంలో కొద్ది కాలంలోనే పంటలు చేతికి రావడం వల్ల రైతుల కోసం తగ్గడంతో పాటు లాభాలు వస్తున్నాయి సాధారణ పంటలతో పోలిస్తే కూరగాయల సాగుతూ నష్టపోయే వారి సంఖ్య తక్కువే ప్రపంచవ్యాప్తంగా కూరగాయల మార్కెట్ పరిమాణం 2022లో 650.25 బిలియన్ డాలర్లు దాదాపు 53 లక్షల కోట్ల రూపాయలు ఉండగా 2023లో అది 814.1 బిలియన్ డాలర్లు సుమారు 66 లక్షల కోట్ల రూపాయలకు చేరింది 2031 నాటికి అది 4914.95 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా

13, మార్చి 2024, బుధవారం

రైతు బడి వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డికి ఐ ఐ ఐ టీ డీ ఆహ్వానం

 ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈనెల 15 16 తేదీలలో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రేరణుర్షిప్ సమ్మిట్ 2024లో పాల్గొని ప్రసంగించాలని తెలుగు రైతు బడి సంస్థ వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డిని ఆహ్వానించింది ఆయన తెలుగు రైతులకు డిజిటల్ మీడియా ద్వారా వ్యవసాయ సమాచార అందిస్తున్నారు సదస్సులో వ్యవసాయం అనుబంధ రంగాలలో యువతకు ఉన్న సరికొత్త అవకాశాల గురించి వివరించాలని సంస్థ కోరింది

హైదరాబాదులో ప్రపంచ వరి సదస్సు

 జూన్ 4 నుంచి 6 వరకు నిర్వహణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 28 దేశాల నుంచి 500 మంది హాజరు అంతర్జాతీయ కామారెడ్డి సంస్థ అంతర్జాతీయ వారి పరిశోధనా సంస్థ తెలిపాంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాదులో ప్రపంచ వరి సదస్సు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు వచ్చే జూన్ 4వ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు హైదరాబాద్ లో ఈ సదస్సు జరుగుతుంది సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది సదస్సులో 28 దేశాల నుంచి దాదాపు 500 మంది శాస్త్రవేత్తలు వ్యాపార సంస్థల ప్రతినిధులు ఎగుమతి దిగుమతి దారులు విద్యావేత్తలు వ్యవసాయ పారిశ్రామికవేత్తలు వరి అనుబంధ ఉత్పత్తుల రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు అని ఆయన వివరించారు ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు తెలంగాణలో పండే వారికి పరి ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం ద్వారా డిమాండ్ కల్పించడం మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే ఈ సతస్సు ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు ఈ జతస్సులో ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్న వరి రకాలను ప్రదర్శించడమే కాకుండా వాటి ప్రాధాన్యతలను వివరిస్తారని మంత్రి తెలిపారు మన దేశం నుంచి బియ్యం ఒక కోటి 77 లక్షల 86 వేల 92 టన్నులు కాగా అందులో తెలంగాణ నుంచి కేవలం 22,498 మెట్రిక్ టన్నులేనని పేర్కొన్నారు తెలంగాణ నుంచి దాదాపు 8,000 క్వింటాళ్లు సర్టిఫైడ్ విత్తనాన్ని కూడా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని వివరించారు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం రకాల ఎగుమతులపై విధించిన నిషేధం వల్ల సన్న బియ్యం పండించిన రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాక రైతులు కొనుగోలు సెంటర్లలో అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు

10, మార్చి 2024, ఆదివారం

ఐక్యరాజ్యసమితిలో అరకు కాఫీ

 మహిళా దినోత్సవాన్ని ప్రత్యేక చర్చ గిరిజన మహిళల పాత్ర పై అభినందనలు భరతనారి శక్తి అద్భుతమని భక్తుల కితాబు

ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయలు గిరిజనులు సాగు చేసే అరకు కాఫీకి అంతర్జాతీయంగా మరో ఘనత దక్కింది ఐక్యరాజ్యసమితిలో అరకు కాఫీ పై ప్రత్యేక చర్చ జరగడంతో పాటు ప్రశంసలు లభించాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా అరకు కాఫీ ప్రయాణంపై ప్రత్యేక చర్చ జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ఐక్యరాజ్యసమితి నాయకులు అరకు కాఫీని భారత నారీ శక్తిని ప్రశంసించారు భారత అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు అన్నారు వ్యవసాయం ఆర్థిక డిజిటల్ సాంకేతికత ఆరోగ్యం విద్య అంతరిక్షం విమానాయన రంగాలలో భారత మహిళలు రాణిస్తున్నారు ప్రశంసించారు అరకు కాశీకి అంతర్జాతీయంగా పేరు రావడంలో గిరిజన మహిళలు ఎంతో కృషి చేశారని కొనియాడారు గిరిజన మహిళల విజయగాత స్ఫూర్తిదాయకమన్నారు ఈ ఏడాది జనవరిలో తాను భారత పర్యటనకు వెళ్ళినప్పుడు నారి శక్తిని ప్రత్యక్షంగా చూశానని గుర్తుచేసుకున్నారు ఆ ప్రాంత గిరిజనులకు సాధికారత గౌరవము లభించాలని వక్తలు పేర్కొన్నారు అరకు కాఫీ ఎంతో రుచిగా నాణ్యతగా ఉండేలా గిరిజనులు స్థిరమైన సాగు పద్ధతులు పాటిస్తున్నారని భారత ప్రతినిధి బృందం పేర్కొంది కాఫీ సాగు నుంచి కోత వరకు ఉత్పత్తి ప్రక్రియలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని వివరించింది.

5, మార్చి 2024, మంగళవారం

గోడౌన్ లోని పంటపై లోన్

 ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఉన్న గోడౌన్లో రైతులు తమ పంటలను స్టోర్ చేసుకుంటే వీటిపై లోన్లు పొందేందుకు కేంద్రం వీలు కల్పిస్తోంది ఎందుకు సంబంధించి ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ సోమవారం ఈ కిసాన్ ఉపజ నిధి డిజిటల్ ప్లాట్ఫార్మ్ ను లాంచ్ చేశారు ఈ ఇనిషియేటివ్ తో రైతుల ఆదాయాలు పెరుగుతాయని అన్నారు వేరే హౌస్ ఓనర్లు చెల్లించి సెక్యూరిటీ డిపాజిట్లను స్టాక్ విలువలో ఒక శాతానికి తగ్గిస్తామని పేర్కొన్నారు ప్రస్తుతం ఇది మూడు శాతంగా ఉంది

వంట నూనెల దిగుమతులు తగ్గించేందుకు కొత్త మిషన్. వంట నూనెల దిగుమతులను తగ్గించుకోవడానికి నూనె గింజల ప్రొడక్షన్ పెంచేందుకు ఒక మిషన్ లాంచ్ చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా సోమవారం పేర్కొన్నారు ఇందుకోసం 11, కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నమని అన్నారు దీనితో పాటు అస్సాంలో ఏర్పాటు చేసిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను ఆయన ప్రారంభించారు ఇండియా ఏడాదికి 1.6 కోట్ల టన్నుల వంటనూనెను దిగుమతి చేసుకుంటుంద

ఆకుకూరలను నగరంలోనే పండిస్తున్నాం

 మా మన మన్యం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో నాలుగు జిల్లాలకు చెందిన 120 మంది రైతులు సభ్యులు ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం పప్పులు తదితర ఉత్పత్తులను అవని ఆర్గానిక్స్ పేరుతో విశాఖ నగరంలోని నాలుగు రైతు బజార్లలోని మాకు కేటాయించిన స్టోర్ ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. అయితే ఆకుకూరలను నగరానికి దూరంగా పొలాల్లో పండించి ఇక్కడికి తెచ్చి వినియోగదారులకు అందించేటప్పటికీ కనీసం 25% పోషకాలు నష్టం జరుగుతుంది ఈ సమస్యను అధిగమించడానికి తాజా ఆకుకూరలను నగరంలోని ప్రకృతి వ్యవసాయంలో పండించి వినియోగదారులకు అందించాలని తలచాం. మా ఆలోచనను ప్రోత్సహించిన ఆంధ్ర యూనివర్సిటీ సహకారంతో 80 సెంట్లు ఖాళీ స్థలంలో అనేక రకాల సాధారణ ఆకుకూరలతో పాటు బాక్ చాయ్ వంటి విదేశీ ఆకుకూరలను కనుమరుగైన కొన్ని రకాల పాతకాలపు ఆకుకూరలను సైతం పండించి ప్రజలకు తాజాగా విక్రయిస్తున్నాం స్థలంతో పాటు నీటిని యూనివర్సిటీ ఇచ్చింది వైర్ ఫెన్సింగ్ డ్రిప్పులు సిబ్బంది జీతాలను మా ఎఫ్ బి ఓ సమకూర్చుతోంది నగరంలో పుట్టి పెరిగే పాఠశాల విద్యార్థులకు నగరవాసులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇంటి పంటల సాగును నేర్పించాలన్నది మా లక్ష్యం. వాలంటీర్లు ఎవరైనా ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో నగరం మధ్యలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి గార్డెనింగ్ పనులను చేస్తూ నేర్చుకోవచ్చు నచ్చిన ఆకుకూరలు తామే కోసుకొని కొనుక్కెళ్ళవచ్చు స్కూలు విద్యార్థులకు ఇంటి పంటలు ప్రకృతి వ్యవసాయ పనులను పరిచయం చేయడానికి ఇదొక మంచి అవకాశం అని మేం భావిస్తున్నాం యూనివర్సిటీలో ఈ పంటలను రెండు ఎకరాలకు విస్తరించే ఆలోచన ఉంది

ఉషా రాజు ఏయూ అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెన్ హబ్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం



3, మార్చి 2024, ఆదివారం

45 రోజులకే పొట్టకొచ్చిన వరి పంట

 సాధారణంగా వారి నాటు వేసిన తర్వాత మూడు నెలలకు పొట్టదశకు వస్తుంది కానీ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన రైతు కిరణ్ సాగు చేసిన వారి 45 రోజులకే పుట్టదశకు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది కిరణ్ వివిధ రకాల కంపెనీలకు చెందిన 27 విత్తన సంచులను కొనుగోలు చేసి పంట వేశాడు ఇందులోని ఏడు సంచుల విత్తనాలలో తేడా వచ్చినట్లు రైతు తెలిపాడు సుమారు మూడు ఎకరాలలో సాగుచేసిన వారి 45 రోజులకే పొట్ట దశకు వచ్చినట్లు పేర్కొన్నాడు ఈ ప్రాంత రైతులు పెద్దపల్లి జిల్లా నుంచి కూడా విత్తనాలు తీసుకొచ్చి నాట్లు వేశారు. వ్యవసాయ అధికారులకు క్షేత్రస్థాయిలో పరిశీలించి దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు



2, మార్చి 2024, శనివారం

రైతులకు ప్రత్యేక శిక్షణ

 జాతీయ పురుగు తెగులు నిఘా సంస్థకు చెందిన మొబైల్ యాప్ పై భిక్కనూరు రైతు వేదికలు రైతులకు శుక్రవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు హైదరాబాద్ జీడిమెట్ల లోని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం అధికారి సునీత ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పదిమంది ఆదర్శ రైతులకు యాప్ వినియోగము పనితీరు ఉపయోగాలను వివరించారు సహాయ సస్యరక్షణ అధికారులు నీలా రాణి రవిశంకర్ శ్వేతా సుధా రైతులు సంతోష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రాజిరెడ్డి నరేష్ స్వామి పాల్గొన్నారు



1, మార్చి 2024, శుక్రవారం

లక్షాధికారులను చేసిన పువ్వులు

ఊరి పేరే పూలపల్లి

సీజన్తో నిమిత్తం లేకుండా కనిపించినంతమేరా పూల తివాచీ పరిచినట్లు బంతులు చేమంతుల తోటలని చూడాలనుకుంటే మహారాష్ట్రలోని పొలాంచ గ్రామానికి వెళ్లాలి అవును నికం వాడి అన్న ఆ ఊరి అసలు పేరు చెబితే ఎవరికీ తెలియదు. పూలంచ అంటేనే తెలుస్తుంది మరి. అక్కడి నుంచి రోజు ట్రక్కులకు ది పువ్వులు నగరాలకు రవాణా అవుతుంటాయి ఈ పల్లెలో కొంతకాలం క్రితం వరకు రైతులు పసుపు చెరకు పండించేవారు నీళ్లు ఉంటే పంట లేకపోతే లేదు ఎంత కష్టపడినా వచ్చే ఆదాయంతో పూట గడవడం కష్టంగా ఉండేది వెంట పడగా పడగా పంట అమ్మిన ఏడాదికి కానీ డబ్బు ఇచ్చేవారు కాదు అలాంటిది 2005లో ఒక వ్యవసాయ అధికారి సలహాతో నలుగురైదుగురు రైతులు ధైర్యం చేసి కొంత పొలంలో బంతిపూల సాగు చేపట్టారు తక్కువ సమయంలోనే వారి చేతికి డబ్బు అందడం చూసి మిగిలిన రైతులు ఆకర్షితులయ్యారు. క్రమంగా 170 మంది చిన్న రైతులు 200 ఎకరాలలో పూల సాగు చేపట్టారు బంతిపూలతో పాటు 8 రంగుల చేమంతులను పండిస్తూ రోజు 12 టన్నుల పూలను రక్కులలో నగరంలోని మార్కెట్ కి పంపుతున్నారు బంతి ఏడాది పొడుగునా పూస్తుంది కానీ చేయమంతులు మాత్రం కొన్నాళ్లే పూస్తాయి అయితేనే జీవితంలో మొదటిసారి లక్షలలో ఆదాయాన్ని కళ్ళ చూడగలుగుతున్నామంటే అది ఈ పూల చలవే అంటున్నారు. పూలంచవాసులు పువ్వులు లేని వేడుకలు ఉండవు కాబట్టి ఆదాయానికి ఢోకాలేదు ఈ ఊరి వాళ్లే పూల మొక్కల నర్సరీ కూడా నిర్వహిస్తూ చుట్టుపక్కల రైతులకు పూలతోటలు పెంచుకోవడానికి సహాయం చేస్తున్నారు




 రలాబా రజనగంధ

ఒడిశాలోని సముద్రతీర ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రలాబా గ్రామము సరిగ్గా పాతికల క్రితం వచ్చిన సూపర్ సైక్లోన్ ఆ ఊరిని అతలాకుతలం చేసింది 250 కిలోమీటర్ల వేగంతో పిలిచిన గాలులకు అక్కడే ప్రజల జీవనాధారమైన తమలపాకు తోటలు పోక చెట్లు నేలకూరిగాయి జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి వారికి చాలా సమయం పట్టింది తుఫాను గండం ఎప్పుడూ పొంచి ఉండేదే కాబట్టి పంటలను మార్చడమే మార్గం అనుకున్న రైతులు రజనీగంధ పూల సాగు వైపు మల్లేరు మొదట్లో 30 మంది 10 ఎకరాలలో ప్రారంభించగా ఇప్పుడు గ్రామంలోని 140 మంది రైతులు పూల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఈసాగే చేస్తూ ఊరిని తమ జీవితాల్ని పరిమళభరితం చేసుకున్నారు వీటి వల్ల భూమిలేని వారికి కూడా చేతినిండా పని దొరికింది రోజు పువ్వులు కోయడం ప్యాక్ చేయడం నగరాలలోని పుష్పగుచ్చాల తయారీదారులకు సరఫరా చేయడం లాంటి పనులు చేస్తూ వారు ఉపాధి పొందుతున్నారు మొక్కలు నాటిన ఎనిమిది నెలలకు పూత ప్రారంభమవుతుంది ఇక అప్పటినుంచి ఎకరానికి ఏటా రెండున్నర లక్షల ఆదాయం గ్యారెంటీ చేయాల్సిందల్లా వారానికోసారి నీళ్లు పెట్టడమే అంటున్నారు రలాబా వాసులు




ఒకటి తుఫానులతో కొట్టుమిట్టాడే ప్రాంతం మరొకటి కరువు బారిన పడిన ప్రాంతం ఇంకొకటి వ్యాపార పంటల నీళ్లు దాహం తీర్చలేక అల్లాడుతున్న ప్రాంతం ఈ మూడింటి తలరాతని మార్చేసి ఒకనాటి పేద రైతులను నేడు లక్షాధికారులను చేస్తుంది పువ్వుల సాగు

ఏటా వాలంటైన్స్ డే నాడు ఆస్ట్రేలియా జపాన్ దుబాయ్ సింగపూర్ మలేషియా ఇలాంటి పలు దేశాలలో అమ్ముడు అవుతున్న ఎర్ర గులాబీలు ఎక్కడివో తెలుసా మనదేశంలోని పశ్చిమ కనుమలలో పూసినవి పూణే జిల్లాలో ఉన్న మావల్ గ్రామంలో ఒకప్పుడు వారి చెరకు ప్రధాన పంటలు రాను రాను ఆ పంటల నీటి దాహాన్ని తీర్చడం రైతుల వల్ల కాలేదు ప్రత్యామ్నాయాల వైపు దృష్టిసారించిన వాళ్లను గులాబీలు ఆకట్టుకున్నాయి 90వ దశకంలో టాటా సంస్థ ఓరియంటల్ ఫ్లోరా టెక్ని ప్రారంభించి డచ్ రోజెస్ని సాగు చేసేది ఆ తర్వాత కొన్ని సంస్థలు కూడా ఈ ప్రయోగం చేశాయి కానీ అదంతా కార్పొరేట్ కంపెనీల వ్యవహారం అనుకున్న రైతులు చాలా కాలం అటువైపు చూడలేదు అలాంటిది గత దశాబ్దంలో ఒక్కొక్కరుగా మొదలుపెట్టి ఇప్పుడు పలువురు రైతులు ఈ బాట పట్టారు బాబు ఎకరంతో మొదలుపెట్టి 15 ఎకరాల వరకు పొలం ఉన్నవాళ్లు కూడా గులాబీ ఉత్పత్తిదారుల సంఘాలలో చేరి రంగురంగుల పువ్వుల్ని సాగు చేస్తున్నారు రోజు టన్నులకొద్దీ గులాబీలను దేశ విదేశీ మార్కెట్లకు పంపుతూ లక్షలలో సంపాదిస్తున్నారు పాలి హౌస్లలో బిందు సేద్యని అనుసరించడం వల్ల నీటికి సమస్య లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు గులాబీల సేద్యం వైపు వెళ్లడం విశేషం ఎకరం పొలం ఉన్న చాలు రోజుకు కనీసం రెండు వేల పువ్వులు వస్తాయని పూల సాగు చేపట్టాక మిగులు ఆదాయాన్ని కళ్ళ చూస్తున్నామని చెబుతున్నారు ఇక్కడి రైతుల





29, ఫిబ్రవరి 2024, గురువారం

 జూలైలో ఇష్ట శతాబ్ది ఉత్సవాలు అర్జెంటీనా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయము అంతర్జాతీయ విత్తన పరీక్ష అసోసియేషన్ ఇస్తా శతాబ్ది ఉత్సవాలను జూలై 1 నుంచి 5వ తేదీ వరకు ఇంగ్లాండులో నిర్వహించనున్నట్లు ఇష్టా అధ్యక్షుడు డాక్టర్ కేశవులు తెలిపారు అంతర్జాతీయంగా ఒకే రకమైన విత్తన పరీక్ష ప్రమాణాలను నిర్ణయించడం కోసం 1924లో స్విట్జర్లాండ్ లో ఇస్తా ఆవిర్భవించిందని పేర్కొన్నారు ఈ ఏడాదితో ఈ సంస్థ ఏర్పాటు వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలోనే శతాబ్ది ఉత్సవాల నిర్వహించనున్నట్లు తెలిపారు

28, ఫిబ్రవరి 2024, బుధవారం

చిరుధాన్యాల మహారాణి రాయి మతి

 చిరుధాన్యాల మహారాణి



ఒడిశా కోరాపుట్ జిల్లాకు చెందిన రాయి మతి ఘియురియా ను చిరుధాన్యాల మహారాణిగా పిలుస్తారు

ఈ గిరిజన రైతు 72 దేశవాళి ధాన్యం రకాలను 30 చిరుధాన్యాల రకాలను సంరక్షిస్తున్నారు. వీటిలో అరుదైన కుంద్రాబతి మండియా దసరా జువానా జెన్కోలి రకాలు కూడా ఉన్నాయి 16 ఏళ్లకే పెళ్లయిన రాయిమతి చిరుధాన్యాల పట్ల తన ప్రేమను ఏమాత్రం వదులుకోలేదు ఇంటి పనులు చేసుకుంటూనే పొలంలో వివిధ పంటలపై ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు ఏడాది కేడాది మెరుగైన పద్ధతులను అవలంబిస్తూ నాణ్యమైన చిరుధాన్యాలను పండిస్తున్నారు దేశవాళి విత్తనాల పరిరక్షణలో రాయి మతికి 70 ఏళ్ల కమలా పూజారి స్ఫూర్తిగా నిలిచారు పద్మశ్రీ పురస్కార గ్రహీత కూడా ఆయన కమల దగ్గర దేశవాళీ విత్తనాల సంరక్షణ పద్ధతులను ఆకలింపు చేసుకున్నారు ఆమె సూచన మేరకే చెన్నై కేంద్రంగా పనిచేసే ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ లో చేరారు అక్కడ విత్తనాల సంరక్షణలో ఆధునిక పద్ధతులు గ్రామీణ మహిళల ఉపాధి లాంటి అంశాల పట్ల అవగాహన తెచ్చుకున్నారు అందుకే నేను బడిలో ఏం చదువుకున్నానో గుర్తులేదు నాకు తెలిసిందల్లా విత్తనాలను భద్రపరచడం వాటిని పండించడం మాత్రమే సాగుభూమి నా బడి అని నవ్వుతూ చెబుతారు రాయి మతి తనకు తెలిసిన విద్యార్థులతోనే అంతరించిపోకుండా మరింతమందికి చేరువ చేస్తున్నారు చిరుధాన్యాల సాగుపై ఇప్పటివరకు 2500 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు రాయి మతి జీవితం అంటే చిరుధాన్యాలు అన్నంతగా ఆమెకు పేరు తెచ్చింది మీరు వచ్చింది. ఇప్పుడా మీ మహిళా రైతుల సహకార సంఘాన్ని నడుపుతున్నారు చిరుధాన్యాల పిండి వంటలు తయారు చేసే స్థానిక మార్కెట్లో విక్రయిస్తున్నారు అంతేకాదు తనకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని వ్యవసాయ పాఠశాల నిర్మాణం కోసం దానం ఇచ్చారు గత ఏడాది ఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ సదస్సులో సంప్రదాయ అవార్డులు చిరుధాన్యాల రకాలను ప్రదర్శించే అరుదైన అవకాశం రాయి మతికి దక్కింది ఆమె చొరవకు రాష్ట్రపతి ద్రౌపది మురుము ప్రశంసలు అందాయి జాతీయస్థాయి గుర్తింపు నన్ను మా వాళ్ళ మధ్య గొప్పగా నిలబెట్టింది అంతర్జాతీయ నాయకుల ప్రశంసలకు అర్హురాలిని చేసింది ఈ గుర్తింపు మరిన్ని రకాలను సంరక్షించేలా మన దేశ గౌరవాన్ని మరింత ఇనుమడించేలా నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అంటారు రాహిమతి


26, ఫిబ్రవరి 2024, సోమవారం

ఎలుకలకు చెల్లు చిట్టి

 ఎలుకల నివారణకు అద్భుత చిట్కా కనిపెట్టిన రైతు రాజిరెడ్డి ,దానికోసం ఎగబడుతున్న రైతులు.

ఎలుకల బారి నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు కన్నమ్మ కష్టాలు పడుతుంటారు ఉచ్చులు పెట్టడం పొలం గట్లపై ఉన్న బొరియల నుంచి వాటిని తరిమేయడానికి పొగ పెట్టడం పురుగుమందులను ఉంచడం లాంటివి ఏమి చేసినా ఎలుకల సమస్య రైతులను పట్టిపీడిస్తూనే ఉంటుంది దీనికి విరుగుడుగా ఇప్పుడు ఒక కొత్త పద్ధతిని రైతుల అవలంబిస్తున్నారు. మూడు మీటర్ల ఎత్తులో ఉండే ఒక కర్రకు చిట్టి కట్టి పొలంలో నాటితే చాలు ఇక ఎలుకల బెడద ఉండనే ఉండదట సిద్దిపేట జిల్లాలోని వందలాది రైతులు ఇప్పుడు ఈ ఎలుకల చిట్టి కోసం దీని రూపకర్త రైతువైన రాజిరెడ్డికి దగ్గరికి పరుగులు తీస్తున్నారు ఇది మూఢనమ్మకమే అయినా ఎలుకల బెడద నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు పడుతున్న తాపత్రయానికి ఉదాహరణగా నిలుస్తోంది భూంపల్లిలోని నాగారం గ్రామానికి చెందిన రాజిరెడ్డి ఇంటి దగ్గరికి వరి రైతులు బారులు తీరుతున్నారు ఎలుకల చిట్టిల కోసం ఎంత డిమాండ్ ఏర్పడిందంటే ఏకంగా నాలుగు గంటల పాటు క్యూలో నిలబడవలసి వస్తోంది రైతులు తమ పేరు భూమి విస్తీర్ణం గ్రామం పేరు తదితర వివరాలు ఇస్తే ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని సర్వే నంబర్ తో సహా రాసి రాజిరెడ్డి ఇస్తాడు చిట్టి అందుకున్నాక ఎక్కడ ఆగకుండా నేరుగా పొలానికి వెళ్లి చిట్టి కట్టిన కర్రను నాటాలి ప్రతి సీజన్లో ఎలుకల వల్ల 80 నుంచి 90% పంటకు నష్టం వాటిల్ లేదని ఈ చిట్టిని కట్టడం వల్ల ఆ బాధ తప్పిందని నారాయణరావుపేటకు చెందిన రైతు మహంకాళి బిక్షపతి చెత్త తెలిపారు తాను గత ఐదేళ్లుగా ఈ చిట్టిని పొలంలో కడుతున్నానని చెప్పారు ఈ విషయం బాగా ప్రాచుర్యం పొందడంతో సిద్దిపేటతో పాటు పొరుగున ఉన్న రాజన్న సిరిసిల్ల ఇతర జిల్లాల రైతులు కూడా రాజిరెడ్డిని కలవడానికి వస్తున్నారట నిత్యం 100 మందికి పైగా ఈ చిట్టిలను తీసుకొని వెళుతున్నారని చెబుతున్న రాజిరెడ్డి ఒక్కో చిట్టికి 50 నుంచి 100 రూపాయల దాకా వసూలు చేస్తున్నానని తెలిపారు అయితే ఆ చిట్టీలు రాసిన అక్షరాలను ఎవరో చదవలేక పోతున్నారు ప్రాచీన తెలుగు భాషకు సంబంధించినటువంటి అక్షరాలేవో ఉన్నట్లు తెలిసింది

Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE