24, మే 2026, ఆదివారం

చేపల పెంపకం పై మూడు రోజుల శిక్షణ శిక్షణ

 నేషనల్ ఫిషరీస్ ఆధ్వర్యంలో ఈనెల 28 29 30 తేదీలలో మంచిర్యాలలో ఏర్పాటు..

మత్స్యకారులను రైతులను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 28 29 30 తేదీలలో మత్స్యకారులకు చేపల పెంపకం పై ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన 50 మంది మత్స్యకారులను ఎంపిక చేశారు. మత్స్యకారులకు శాస్త్రీయ పద్ధతుల్లో చేపల పెంపకం పై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు. చేపల పెంపకం ఉత్పాదకను ఎలా పెంచాలి? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. వీటితోపాటు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కొర్రమీను/స్నేక్ హెడ్ పెంపకం, యాజమాన్య పద్ధతులపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తారు. జాతీయస్థాయి మత్సరంగ శాస్త్రవేత్తలు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అధికారులు హాజరై మత్స్యకారులు రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తారు. ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని మత్స్యకారులు రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని అధికారులు కోరారు.

తిరుపతిలో పాలేకర్ శిక్షణ శిబిరం

 ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఐదు రోజుల శిక్షణ శిబిరం ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించనున్నారు.

ఈ ఐదు రోజుల రెసిడెన్షియల్ రైతు శిక్షణ శిబిరం జూన్ 10 నుండి 14వ తేదీ వరకు జరగనున్న ది. పాలేకర్ ఆంగ్ల ప్రసాద్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఉంటుంది. స్వచ్ఛంద సేవకులు డాక్టర్ గంగాధర్ విజయ్ రామ్, పారిశ్రామిక వేత్త రామలింగారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని తిరుపతి చంద్రగిరి రోడ్ లోని ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు.హాజరయ్యే రైతులకు హాస్టల్ హెచ్ లో వసతి కల్పించ నున్నారు. గ్రామ స్వరాజ్యం, విష ముక్త, రోగ ముక్త ఆహారోత్పత్తి లక్ష్యంగా సుభాష్ పాలేకర్ కృషి SPK పద్ధతిలో ఇమిడి ఉన్న అన్ని అంశాలపై పాలేకర్ రోజుకు 12 గంటల పాటు లోతుగా శిక్షణ ఇస్తారు.5 రోజులు భోజన,వసతికి 1500 రూపాయలు చెల్లిస్తే చాలు.ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పని సరి.

పూర్తి వివరాలకు 96669 11116,94924 84003,93475 78819 ఫోన్ నెంబర్ లలో సంప్రదించ ాలని తెలిపారు.

21, మే 2026, గురువారం

నిమ్మ దిగుబడి పెరగాలంటే

 వేసవికాలంలో నిమ్మ పండ్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెరటి తోట లోని నిమ్మ చెట్టు పుష్కలంగా కాయలు కాయాలంటే.. సరైన పోషణ, సంరక్షణ ముఖ్యం. ఎండల తీవ్రత పెరిగినపుడు నిమ్మ చెట్టు కు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. కాయలు రాలకుండా మంచి దిగుబడి రావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి.

ఉష్ణోగ్రత లు పెరిగినపుడు భూమిలో తేమ ఆరిపోకుండా చూసుకోవాలి. నేల పూర్తిగా ఎండిపోక ముందే నీరు పెట్టాలి.ఐతే మరీ ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఉదయం ఎండ రాకముందు ,సాయంత్రం ఎండ తగ్గిన తర్వాతే నీరు పెట్టడం మంచిది. దీని వల్ల వేర్లు చల్లగా ఉంటాయి. ఎండ దెబ్బ నుండి వేర్లను కాపాడటానికి మొక్కల మొదళ్ల దగ్గిర మల్చింగ్ చేయడం మంచిది.చెట్టు మొదలు చుట్టూ ఎండు గడ్డి , ఎండిన ఆకులు , కొబ్బరి పీచుతో 3-4 అంగుళాల మేర కప్పితే..వేర్లు దెబ్బ తినకుండా ఉంటాయి. నేలలో తేమ ఎక్కువ సేపు ఉంటుంది కూడా.. నేలకు తగిలేలా ఉండే కింది కొమ్మలను కత్తిరించాలి. దీని వల్ల తెగుళ్ళ ఉధృతి తగ్గుతుంది. ఇక నిమ్మలో పూత రాలకుండా ఉండటానికి , కాయల పరిమాణం పెరగడానికి .. ఒక లీటర్ నీటిలో 2గ్రా బోరాన్ ,5 గ్రా జింక్ సల్ఫేట్ ను కలిపి పిచికారీ చేయాలి.ఇంట్లో మిగిలిన పుల్లని పెరుగుతో మజ్జిగ చేసి , నిమ్మ చెట్టు మొదట్లో పోయాలి.చెట్టుపై పిచికారీ చేసినా.. శిలీంధ్ర తెగుళ్లు తగ్గుతాయి..

15, మే 2026, శుక్రవారం

ఈ - ట్రాక్టర్ రైతులకు ఉపయోగకరము

 


తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సి ఎస్ ఐ ఆర్ సీఎం ఈ ఆర్ ఐ ప్రిమాఈటీ 11 అనే స్వదేశీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను అభివృద్ధి చేసింది గురువారం హైదరాబాదులోని ఎన్జీఆర్ఐ లో ఈ ట్రాక్టర్ ను ప్రమోట్ చేయడానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐఏసిటి డైరెక్టర్ డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి ఎం జి ఆర్ ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్ సీఎం ఈఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ నరేష్ చంద్ర మురుములతో కలిసి ట్రయల్ రన్ రోడ్ షో న ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జింగ్ ద్వారా నడిచే ఏ ట్రాక్టర్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు పొలాలలో ఈ ట్రాక్టర్ సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు తక్కువ వైబ్రేషన్ ఉండడం వల్ల మహిళలు సైతం సునాయాసంగా నడపగల వాహనం ఇది అని వివరించారు 26 హెచ్పీ సామర్థ్యం గల ఈ వాహనంలో 90 శాతం వరకు స్వదేశీ విడిభాగాలు ఉన్నట్లు తెలిపారు

1, మే 2026, శుక్రవారం

నిషేధిత పురుగుమందులను ఆన్లైన్లో విక్రయించవద్దు

 నిషేధిత పారాక్వాట్ సహా ఇతర పురుగుమందు లేవీ ఆన్లైన్లో విక్రయించరాదని ఈ కామర్శ సంస్థ అయిన అమెజాన్ ను తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఆదేశించింది .గురువారం కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు ,అమెజాన్ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు .ఈ కామర్స్ సంస్థల ద్వారా పురుగుమందుల విక్రయాలు, దానివలన ఏర్పడుతున్న అనర్ధాలపై చర్చించారు .

అనంతరం చైర్మన్ మాట్లాడుతూ మానవ ఆరోగ్యానికి హానికరమైన విషపూరిత పురుగుమందులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయని, వాటిని ఆన్లైన్లో విక్రయించవద్దని అమెజాన్ సంస్థ ప్రతినిధులకు సూచించారు .దీనిపై అమెజాన్ ప్రతినిధులు స్పందిస్తూ వ్యవసాయ కమిషన్ సూచనలను పాటిస్తామని, తమ విక్రయాల జాబితా నుంచి నిషేధిత పురుగుమందులను తొలగిస్తామని చెప్పారు.

Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE