నిషేధిత పారాక్వాట్ సహా ఇతర పురుగుమందు లేవీ ఆన్లైన్లో విక్రయించరాదని ఈ కామర్శ సంస్థ అయిన అమెజాన్ ను తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఆదేశించింది .గురువారం కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు ,అమెజాన్ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు .ఈ కామర్స్ సంస్థల ద్వారా పురుగుమందుల విక్రయాలు, దానివలన ఏర్పడుతున్న అనర్ధాలపై చర్చించారు .
అనంతరం చైర్మన్ మాట్లాడుతూ మానవ ఆరోగ్యానికి హానికరమైన విషపూరిత పురుగుమందులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయని, వాటిని ఆన్లైన్లో విక్రయించవద్దని అమెజాన్ సంస్థ ప్రతినిధులకు సూచించారు .దీనిపై అమెజాన్ ప్రతినిధులు స్పందిస్తూ వ్యవసాయ కమిషన్ సూచనలను పాటిస్తామని, తమ విక్రయాల జాబితా నుంచి నిషేధిత పురుగుమందులను తొలగిస్తామని చెప్పారు.