తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సి ఎస్ ఐ ఆర్ సీఎం ఈ ఆర్ ఐ ప్రిమాఈటీ 11 అనే స్వదేశీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను అభివృద్ధి చేసింది గురువారం హైదరాబాదులోని ఎన్జీఆర్ఐ లో ఈ ట్రాక్టర్ ను ప్రమోట్ చేయడానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐఏసిటి డైరెక్టర్ డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి ఎం జి ఆర్ ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్ సీఎం ఈఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ నరేష్ చంద్ర మురుములతో కలిసి ట్రయల్ రన్ రోడ్ షో న ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జింగ్ ద్వారా నడిచే ఏ ట్రాక్టర్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు పొలాలలో ఈ ట్రాక్టర్ సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు తక్కువ వైబ్రేషన్ ఉండడం వల్ల మహిళలు సైతం సునాయాసంగా నడపగల వాహనం ఇది అని వివరించారు 26 హెచ్పీ సామర్థ్యం గల ఈ వాహనంలో 90 శాతం వరకు స్వదేశీ విడిభాగాలు ఉన్నట్లు తెలిపారు
