Wednesday 27 March 2024

పాల దిగుబడి కి ఇలా చేస్తే మేలు

 రైతులకు వ్యవసాయంతో పాటు పాడి అభివృద్ధి చెందితేనే గిట్టుబాటుగా ఉంటుంది దీనికి చిన్న చిట్కాలు పాటిస్తే పశువులకు పోషకాలు అందడంతో పాల ఉత్పత్తి పెరుగుతుందని పశువైద్యాధికారి సురేష్ తెలిపారు పచ్చిగడ్డి వెండి గడ్డిని కలిపి ఇవ్వాలి. పచ్చి గడ్డిలో 90 శాతం నీరు ఉంటుంది అదే ఎండు గడ్డిలో 10% నీరు ఉంటుంది రెండు భాగాలు పచ్చి ఒక భాగం వెండి గడ్డి కలిపి అందించాలి పాలు పితికిన తర్వాత మేత వేయాలి దాదాపుడిగా అయినా లేదా నాన్న పెట్టి అయినా ఇవ్వవచ్చు అయితే నానబెట్టడం వల్ల నమ్మడానికి జీర్ణం కావడానికి సౌకర్యంగా ఉంటుంది ఆరు గంటల పాటు నానబెడితే మంచిది

Friday 22 March 2024

కూరగాయల రైతులకు గ్లోబల్ అవకాశాలు

 ప్రణాళికలతో లాభాల సాగు ఎగుమతులపై దృష్టి పెట్టాలి సింజంట ఆసియా పసిఫిక్ విభాగాధిపతి నిశ్చింత భాటియా



తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ కూరగాయల రైతులకు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయని సరైన పద్ధతుల్లో సాగు శుద్ధి విధానాలను ఆలంపిస్తే వారు భారీ లాభాలు పొందుతారని ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించగలుగుతారని కూరగాయల విత్తన సంస్థ సింజంట ఆసియా పసిఫిక్ విభాగాధిపతి నిశ్చింత భాటి అన్నారు హైదరాబాద్ శివారులోని నూతనకల్లో తమ సంస్థ తరఫున ప్రపంచ స్థాయి మూడు అత్యాధునిక విత్తన ఆరోగ్య ప్రయోగశాల సీడ్ హెల్త్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరై హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఏమన్నారు అంటే

ప్రపంచ దేశాల్లో 70 శాతం మేర భారత్ లో 80 శాతానికి పైగా ప్రజలు కూరగాయల ఆహారాన్ని భోంచేస్తున్నారు ఆరోగ్యపరంగా కూరగాయల శ్రేష్టమైనవి వాటిని వినియోగించే వారిలో 90 శాతం మందికి అనారోగ్య సమస్యలు లేవు జంక్ ఫుడ్ తినేవారిలో 40 శాతానికి పైగా అధిక బరువు సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని అధ్యయనాలు వెల్లడించాయి నా ప్రణాళికతోనే కూరగాయల సాగును నిర్దిష్ట ప్రణాళికతో చేపట్టాలి విత్తన రకాలను ఎంచుకొని కాలానికి అనుకూలంగా పండించాలి పురుగుమందులు కొద్ది మోతాదులోని ఉపయోగించాలి కోత దశతో పాటు నిల్వ శుద్ధిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి మార్కెటింగ్ ఏకమతల పైన దృష్టి సారించాలి ఛత్తీస్గఢ్లోని రాయపూర్ రైతు ఎకరంలో 90 టన్నుల దాకా టమాటాను పండించార. దీని ద్వారా వాణిజ్య పంటల కంటే రెట్టింపు ఆదాయం వచ్చింది కరీంనగర్ కూరగాయల రైతులు లాభాలు గడిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి రైతుల్లో ఎక్కువమంది టమాటా సాగుతూ లబ్ధి పొందుతున్నారు ఇజ్రాయిల్ జర్మనీ తదితర విదేశాల్లోనూ కూరగాయల సాగుతూ రైతులు లాభాలను గడిస్తున్నారు

విత్తనాల నాణ్యత ప్రమాణికం సింజంటా భారత్ లోని అతిపెద్ద మూడు కూరగాయల విత్తన సంస్థల్లో ఒకటి ప్రపంచవ్యాప్తంగా 124 దేశాల్లోని 26 పంటలకు విత్తనాలను తయారుచేసి పంపిణీ చేస్తున్నాం తెలంగాణ ఏపీ లలో 160 విత్తన రకాలను విక్రయిస్తున్నాను. విత్తనాలను ఎక్కడికక్కడ స్థానిక రైతులతో సిద్ధం చేస్తున్నాము విత్తనాల నాణ్యతకే ప్రాధాన్యమిస్తున్నాం నిపుణులైన వారితో అన్ని రకాల జర్మినేషన్ పరీక్షలు నిర్వహించిన అనంతరమే మార్కెట్లో విక్రయిస్తున్నాం దేశంలో ఈ ఏడాది 11 మిలియన్ విత్తన ప్యాకెట్లను విక్రయించాము విత్తన రకాలపై ముందస్తు పరీక్షల కోసం అమెరికా నెదర్లాండ్స్ తో పాటు భారత్లో ల్యాబ్ను ఏర్పాటు చేశాం హైదరాబాద్ నూతనకల్లో ల్యాబ్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన విత్తన పరీక్షా కేంద్రాల్లో ఒకటి భారత్తో ఆసియా పసిఫిక్ మరియు వెలుపల సాగుదారులకు సేవలందిస్తుంది. విత్తన నాణ్యత ప్రమాణాల ద్వారా రైతులకు నమ్మకంతో పాటు లాభాలను అందించేందుకు కృషి చేస్తున్నాం అన్నారు

సాగు పెరిగింది గత ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కూరగాయల సాగు విస్తీర్ణం 10% మేరా పెరిగింది తక్కువ విస్తీర్ణంలో కొద్ది కాలంలోనే పంటలు చేతికి రావడం వల్ల రైతుల కోసం తగ్గడంతో పాటు లాభాలు వస్తున్నాయి సాధారణ పంటలతో పోలిస్తే కూరగాయల సాగుతూ నష్టపోయే వారి సంఖ్య తక్కువే ప్రపంచవ్యాప్తంగా కూరగాయల మార్కెట్ పరిమాణం 2022లో 650.25 బిలియన్ డాలర్లు దాదాపు 53 లక్షల కోట్ల రూపాయలు ఉండగా 2023లో అది 814.1 బిలియన్ డాలర్లు సుమారు 66 లక్షల కోట్ల రూపాయలకు చేరింది 2031 నాటికి అది 4914.95 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా

Wednesday 13 March 2024

రైతు బడి వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డికి ఐ ఐ ఐ టీ డీ ఆహ్వానం

 ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈనెల 15 16 తేదీలలో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రేరణుర్షిప్ సమ్మిట్ 2024లో పాల్గొని ప్రసంగించాలని తెలుగు రైతు బడి సంస్థ వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డిని ఆహ్వానించింది ఆయన తెలుగు రైతులకు డిజిటల్ మీడియా ద్వారా వ్యవసాయ సమాచార అందిస్తున్నారు సదస్సులో వ్యవసాయం అనుబంధ రంగాలలో యువతకు ఉన్న సరికొత్త అవకాశాల గురించి వివరించాలని సంస్థ కోరింది

హైదరాబాదులో ప్రపంచ వరి సదస్సు

 జూన్ 4 నుంచి 6 వరకు నిర్వహణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 28 దేశాల నుంచి 500 మంది హాజరు అంతర్జాతీయ కామారెడ్డి సంస్థ అంతర్జాతీయ వారి పరిశోధనా సంస్థ తెలిపాంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాదులో ప్రపంచ వరి సదస్సు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు వచ్చే జూన్ 4వ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు హైదరాబాద్ లో ఈ సదస్సు జరుగుతుంది సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది సదస్సులో 28 దేశాల నుంచి దాదాపు 500 మంది శాస్త్రవేత్తలు వ్యాపార సంస్థల ప్రతినిధులు ఎగుమతి దిగుమతి దారులు విద్యావేత్తలు వ్యవసాయ పారిశ్రామికవేత్తలు వరి అనుబంధ ఉత్పత్తుల రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు అని ఆయన వివరించారు ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు తెలంగాణలో పండే వారికి పరి ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం ద్వారా డిమాండ్ కల్పించడం మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే ఈ సతస్సు ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు ఈ జతస్సులో ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్న వరి రకాలను ప్రదర్శించడమే కాకుండా వాటి ప్రాధాన్యతలను వివరిస్తారని మంత్రి తెలిపారు మన దేశం నుంచి బియ్యం ఒక కోటి 77 లక్షల 86 వేల 92 టన్నులు కాగా అందులో తెలంగాణ నుంచి కేవలం 22,498 మెట్రిక్ టన్నులేనని పేర్కొన్నారు తెలంగాణ నుంచి దాదాపు 8,000 క్వింటాళ్లు సర్టిఫైడ్ విత్తనాన్ని కూడా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని వివరించారు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం రకాల ఎగుమతులపై విధించిన నిషేధం వల్ల సన్న బియ్యం పండించిన రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాక రైతులు కొనుగోలు సెంటర్లలో అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు

Sunday 10 March 2024

ఐక్యరాజ్యసమితిలో అరకు కాఫీ

 మహిళా దినోత్సవాన్ని ప్రత్యేక చర్చ గిరిజన మహిళల పాత్ర పై అభినందనలు భరతనారి శక్తి అద్భుతమని భక్తుల కితాబు

ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయలు గిరిజనులు సాగు చేసే అరకు కాఫీకి అంతర్జాతీయంగా మరో ఘనత దక్కింది ఐక్యరాజ్యసమితిలో అరకు కాఫీ పై ప్రత్యేక చర్చ జరగడంతో పాటు ప్రశంసలు లభించాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా అరకు కాఫీ ప్రయాణంపై ప్రత్యేక చర్చ జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ఐక్యరాజ్యసమితి నాయకులు అరకు కాఫీని భారత నారీ శక్తిని ప్రశంసించారు భారత అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు అన్నారు వ్యవసాయం ఆర్థిక డిజిటల్ సాంకేతికత ఆరోగ్యం విద్య అంతరిక్షం విమానాయన రంగాలలో భారత మహిళలు రాణిస్తున్నారు ప్రశంసించారు అరకు కాశీకి అంతర్జాతీయంగా పేరు రావడంలో గిరిజన మహిళలు ఎంతో కృషి చేశారని కొనియాడారు గిరిజన మహిళల విజయగాత స్ఫూర్తిదాయకమన్నారు ఈ ఏడాది జనవరిలో తాను భారత పర్యటనకు వెళ్ళినప్పుడు నారి శక్తిని ప్రత్యక్షంగా చూశానని గుర్తుచేసుకున్నారు ఆ ప్రాంత గిరిజనులకు సాధికారత గౌరవము లభించాలని వక్తలు పేర్కొన్నారు అరకు కాఫీ ఎంతో రుచిగా నాణ్యతగా ఉండేలా గిరిజనులు స్థిరమైన సాగు పద్ధతులు పాటిస్తున్నారని భారత ప్రతినిధి బృందం పేర్కొంది కాఫీ సాగు నుంచి కోత వరకు ఉత్పత్తి ప్రక్రియలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని వివరించింది.

Tuesday 5 March 2024

గోడౌన్ లోని పంటపై లోన్

 ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఉన్న గోడౌన్లో రైతులు తమ పంటలను స్టోర్ చేసుకుంటే వీటిపై లోన్లు పొందేందుకు కేంద్రం వీలు కల్పిస్తోంది ఎందుకు సంబంధించి ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ సోమవారం ఈ కిసాన్ ఉపజ నిధి డిజిటల్ ప్లాట్ఫార్మ్ ను లాంచ్ చేశారు ఈ ఇనిషియేటివ్ తో రైతుల ఆదాయాలు పెరుగుతాయని అన్నారు వేరే హౌస్ ఓనర్లు చెల్లించి సెక్యూరిటీ డిపాజిట్లను స్టాక్ విలువలో ఒక శాతానికి తగ్గిస్తామని పేర్కొన్నారు ప్రస్తుతం ఇది మూడు శాతంగా ఉంది

వంట నూనెల దిగుమతులు తగ్గించేందుకు కొత్త మిషన్. వంట నూనెల దిగుమతులను తగ్గించుకోవడానికి నూనె గింజల ప్రొడక్షన్ పెంచేందుకు ఒక మిషన్ లాంచ్ చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా సోమవారం పేర్కొన్నారు ఇందుకోసం 11, కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నమని అన్నారు దీనితో పాటు అస్సాంలో ఏర్పాటు చేసిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను ఆయన ప్రారంభించారు ఇండియా ఏడాదికి 1.6 కోట్ల టన్నుల వంటనూనెను దిగుమతి చేసుకుంటుంద

ఆకుకూరలను నగరంలోనే పండిస్తున్నాం

 మా మన మన్యం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో నాలుగు జిల్లాలకు చెందిన 120 మంది రైతులు సభ్యులు ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం పప్పులు తదితర ఉత్పత్తులను అవని ఆర్గానిక్స్ పేరుతో విశాఖ నగరంలోని నాలుగు రైతు బజార్లలోని మాకు కేటాయించిన స్టోర్ ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. అయితే ఆకుకూరలను నగరానికి దూరంగా పొలాల్లో పండించి ఇక్కడికి తెచ్చి వినియోగదారులకు అందించేటప్పటికీ కనీసం 25% పోషకాలు నష్టం జరుగుతుంది ఈ సమస్యను అధిగమించడానికి తాజా ఆకుకూరలను నగరంలోని ప్రకృతి వ్యవసాయంలో పండించి వినియోగదారులకు అందించాలని తలచాం. మా ఆలోచనను ప్రోత్సహించిన ఆంధ్ర యూనివర్సిటీ సహకారంతో 80 సెంట్లు ఖాళీ స్థలంలో అనేక రకాల సాధారణ ఆకుకూరలతో పాటు బాక్ చాయ్ వంటి విదేశీ ఆకుకూరలను కనుమరుగైన కొన్ని రకాల పాతకాలపు ఆకుకూరలను సైతం పండించి ప్రజలకు తాజాగా విక్రయిస్తున్నాం స్థలంతో పాటు నీటిని యూనివర్సిటీ ఇచ్చింది వైర్ ఫెన్సింగ్ డ్రిప్పులు సిబ్బంది జీతాలను మా ఎఫ్ బి ఓ సమకూర్చుతోంది నగరంలో పుట్టి పెరిగే పాఠశాల విద్యార్థులకు నగరవాసులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇంటి పంటల సాగును నేర్పించాలన్నది మా లక్ష్యం. వాలంటీర్లు ఎవరైనా ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో నగరం మధ్యలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి గార్డెనింగ్ పనులను చేస్తూ నేర్చుకోవచ్చు నచ్చిన ఆకుకూరలు తామే కోసుకొని కొనుక్కెళ్ళవచ్చు స్కూలు విద్యార్థులకు ఇంటి పంటలు ప్రకృతి వ్యవసాయ పనులను పరిచయం చేయడానికి ఇదొక మంచి అవకాశం అని మేం భావిస్తున్నాం యూనివర్సిటీలో ఈ పంటలను రెండు ఎకరాలకు విస్తరించే ఆలోచన ఉంది

ఉషా రాజు ఏయూ అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెన్ హబ్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం



Sunday 3 March 2024

45 రోజులకే పొట్టకొచ్చిన వరి పంట

 సాధారణంగా వారి నాటు వేసిన తర్వాత మూడు నెలలకు పొట్టదశకు వస్తుంది కానీ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన రైతు కిరణ్ సాగు చేసిన వారి 45 రోజులకే పుట్టదశకు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది కిరణ్ వివిధ రకాల కంపెనీలకు చెందిన 27 విత్తన సంచులను కొనుగోలు చేసి పంట వేశాడు ఇందులోని ఏడు సంచుల విత్తనాలలో తేడా వచ్చినట్లు రైతు తెలిపాడు సుమారు మూడు ఎకరాలలో సాగుచేసిన వారి 45 రోజులకే పొట్ట దశకు వచ్చినట్లు పేర్కొన్నాడు ఈ ప్రాంత రైతులు పెద్దపల్లి జిల్లా నుంచి కూడా విత్తనాలు తీసుకొచ్చి నాట్లు వేశారు. వ్యవసాయ అధికారులకు క్షేత్రస్థాయిలో పరిశీలించి దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు



Saturday 2 March 2024

రైతులకు ప్రత్యేక శిక్షణ

 జాతీయ పురుగు తెగులు నిఘా సంస్థకు చెందిన మొబైల్ యాప్ పై భిక్కనూరు రైతు వేదికలు రైతులకు శుక్రవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు హైదరాబాద్ జీడిమెట్ల లోని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం అధికారి సునీత ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పదిమంది ఆదర్శ రైతులకు యాప్ వినియోగము పనితీరు ఉపయోగాలను వివరించారు సహాయ సస్యరక్షణ అధికారులు నీలా రాణి రవిశంకర్ శ్వేతా సుధా రైతులు సంతోష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రాజిరెడ్డి నరేష్ స్వామి పాల్గొన్నారు



Friday 1 March 2024

లక్షాధికారులను చేసిన పువ్వులు

ఊరి పేరే పూలపల్లి

సీజన్తో నిమిత్తం లేకుండా కనిపించినంతమేరా పూల తివాచీ పరిచినట్లు బంతులు చేమంతుల తోటలని చూడాలనుకుంటే మహారాష్ట్రలోని పొలాంచ గ్రామానికి వెళ్లాలి అవును నికం వాడి అన్న ఆ ఊరి అసలు పేరు చెబితే ఎవరికీ తెలియదు. పూలంచ అంటేనే తెలుస్తుంది మరి. అక్కడి నుంచి రోజు ట్రక్కులకు ది పువ్వులు నగరాలకు రవాణా అవుతుంటాయి ఈ పల్లెలో కొంతకాలం క్రితం వరకు రైతులు పసుపు చెరకు పండించేవారు నీళ్లు ఉంటే పంట లేకపోతే లేదు ఎంత కష్టపడినా వచ్చే ఆదాయంతో పూట గడవడం కష్టంగా ఉండేది వెంట పడగా పడగా పంట అమ్మిన ఏడాదికి కానీ డబ్బు ఇచ్చేవారు కాదు అలాంటిది 2005లో ఒక వ్యవసాయ అధికారి సలహాతో నలుగురైదుగురు రైతులు ధైర్యం చేసి కొంత పొలంలో బంతిపూల సాగు చేపట్టారు తక్కువ సమయంలోనే వారి చేతికి డబ్బు అందడం చూసి మిగిలిన రైతులు ఆకర్షితులయ్యారు. క్రమంగా 170 మంది చిన్న రైతులు 200 ఎకరాలలో పూల సాగు చేపట్టారు బంతిపూలతో పాటు 8 రంగుల చేమంతులను పండిస్తూ రోజు 12 టన్నుల పూలను రక్కులలో నగరంలోని మార్కెట్ కి పంపుతున్నారు బంతి ఏడాది పొడుగునా పూస్తుంది కానీ చేయమంతులు మాత్రం కొన్నాళ్లే పూస్తాయి అయితేనే జీవితంలో మొదటిసారి లక్షలలో ఆదాయాన్ని కళ్ళ చూడగలుగుతున్నామంటే అది ఈ పూల చలవే అంటున్నారు. పూలంచవాసులు పువ్వులు లేని వేడుకలు ఉండవు కాబట్టి ఆదాయానికి ఢోకాలేదు ఈ ఊరి వాళ్లే పూల మొక్కల నర్సరీ కూడా నిర్వహిస్తూ చుట్టుపక్కల రైతులకు పూలతోటలు పెంచుకోవడానికి సహాయం చేస్తున్నారు




 రలాబా రజనగంధ

ఒడిశాలోని సముద్రతీర ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రలాబా గ్రామము సరిగ్గా పాతికల క్రితం వచ్చిన సూపర్ సైక్లోన్ ఆ ఊరిని అతలాకుతలం చేసింది 250 కిలోమీటర్ల వేగంతో పిలిచిన గాలులకు అక్కడే ప్రజల జీవనాధారమైన తమలపాకు తోటలు పోక చెట్లు నేలకూరిగాయి జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి వారికి చాలా సమయం పట్టింది తుఫాను గండం ఎప్పుడూ పొంచి ఉండేదే కాబట్టి పంటలను మార్చడమే మార్గం అనుకున్న రైతులు రజనీగంధ పూల సాగు వైపు మల్లేరు మొదట్లో 30 మంది 10 ఎకరాలలో ప్రారంభించగా ఇప్పుడు గ్రామంలోని 140 మంది రైతులు పూల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఈసాగే చేస్తూ ఊరిని తమ జీవితాల్ని పరిమళభరితం చేసుకున్నారు వీటి వల్ల భూమిలేని వారికి కూడా చేతినిండా పని దొరికింది రోజు పువ్వులు కోయడం ప్యాక్ చేయడం నగరాలలోని పుష్పగుచ్చాల తయారీదారులకు సరఫరా చేయడం లాంటి పనులు చేస్తూ వారు ఉపాధి పొందుతున్నారు మొక్కలు నాటిన ఎనిమిది నెలలకు పూత ప్రారంభమవుతుంది ఇక అప్పటినుంచి ఎకరానికి ఏటా రెండున్నర లక్షల ఆదాయం గ్యారెంటీ చేయాల్సిందల్లా వారానికోసారి నీళ్లు పెట్టడమే అంటున్నారు రలాబా వాసులు




ఒకటి తుఫానులతో కొట్టుమిట్టాడే ప్రాంతం మరొకటి కరువు బారిన పడిన ప్రాంతం ఇంకొకటి వ్యాపార పంటల నీళ్లు దాహం తీర్చలేక అల్లాడుతున్న ప్రాంతం ఈ మూడింటి తలరాతని మార్చేసి ఒకనాటి పేద రైతులను నేడు లక్షాధికారులను చేస్తుంది పువ్వుల సాగు

ఏటా వాలంటైన్స్ డే నాడు ఆస్ట్రేలియా జపాన్ దుబాయ్ సింగపూర్ మలేషియా ఇలాంటి పలు దేశాలలో అమ్ముడు అవుతున్న ఎర్ర గులాబీలు ఎక్కడివో తెలుసా మనదేశంలోని పశ్చిమ కనుమలలో పూసినవి పూణే జిల్లాలో ఉన్న మావల్ గ్రామంలో ఒకప్పుడు వారి చెరకు ప్రధాన పంటలు రాను రాను ఆ పంటల నీటి దాహాన్ని తీర్చడం రైతుల వల్ల కాలేదు ప్రత్యామ్నాయాల వైపు దృష్టిసారించిన వాళ్లను గులాబీలు ఆకట్టుకున్నాయి 90వ దశకంలో టాటా సంస్థ ఓరియంటల్ ఫ్లోరా టెక్ని ప్రారంభించి డచ్ రోజెస్ని సాగు చేసేది ఆ తర్వాత కొన్ని సంస్థలు కూడా ఈ ప్రయోగం చేశాయి కానీ అదంతా కార్పొరేట్ కంపెనీల వ్యవహారం అనుకున్న రైతులు చాలా కాలం అటువైపు చూడలేదు అలాంటిది గత దశాబ్దంలో ఒక్కొక్కరుగా మొదలుపెట్టి ఇప్పుడు పలువురు రైతులు ఈ బాట పట్టారు బాబు ఎకరంతో మొదలుపెట్టి 15 ఎకరాల వరకు పొలం ఉన్నవాళ్లు కూడా గులాబీ ఉత్పత్తిదారుల సంఘాలలో చేరి రంగురంగుల పువ్వుల్ని సాగు చేస్తున్నారు రోజు టన్నులకొద్దీ గులాబీలను దేశ విదేశీ మార్కెట్లకు పంపుతూ లక్షలలో సంపాదిస్తున్నారు పాలి హౌస్లలో బిందు సేద్యని అనుసరించడం వల్ల నీటికి సమస్య లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు గులాబీల సేద్యం వైపు వెళ్లడం విశేషం ఎకరం పొలం ఉన్న చాలు రోజుకు కనీసం రెండు వేల పువ్వులు వస్తాయని పూల సాగు చేపట్టాక మిగులు ఆదాయాన్ని కళ్ళ చూస్తున్నామని చెబుతున్నారు ఇక్కడి రైతుల