ఫిబ్రవరి 27 28 మార్చి ఒకటి తేదీలలో కర్ణాటకలోని మైసూరులో దక్షిణ భారత కిసాన్ స్వరాజ్ సమ్మేళనం జరగనుంది. కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ సహకారంతో అలయన్స్ ఫర్ సస్టైనబుల్ హోలిస్టిక్ అగ్రికల్చర్ ఆశా ఈ ఆరవ సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. రెండేళ్లకోసారి ఈ ఉత్సవం జరుగుతుంది .2022 లోను మైసూరులోని జరిగిన సమ్మేళనంలో తెలుగు రాష్ట్రాల నుండి 300 మంది పాల్గొన్నారు .పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతులు కార్యకర్తలు శాస్త్రవేత్తలు వినియోగదారులను ఒకచోట చేర్చి అఖిలభారత అనధికారిక పౌర స్వచ్ఛంద సేవకుల సమ్మేళనం ఇది .ప్రకృతి ,సేంద్రియ వ్యవసాయ పద్ధతులు రైతుల హక్కులు ,దేశీ వంగడాలు ,వ్యవసాయ సంస్కృతి కలల పరిరక్షణ లక్ష్యంతో చర్చగోస్టులు ,సదస్సులు నిర్వహిస్తారు .విత్తన సార్వభౌమత్వం ,గడ్డి మందులను తట్టుకునే జన్యు మార్పిడి పంటలు, కలుపు యాజమాన్యం వ్యవసాయంలో శ్రమశక్తి ,అడవి జంతువులతో పంటలకు ముప్పును తట్టుకుని నిలబడడం ఎలా? ఇలాంటి అంశాలపై లోతైన చర్చ జరుగుతుంది.
పాల్గొనదలచిన వారు..
ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. మూడు రోజులకు వసతి ,భోజనం అన్నీ కలిపి రైతులు విద్యార్థులకు 1500 రూపాయలు, మహిళా రైతులకు 800 రూపాయలు ఇతరులకు 2500 నుండి 3500.
చివరి తేదీ ..
ఫిబ్రవరి 15 ,2026 .
ఇతర వివరాలు ..810 55 798 39
ఇమెయిల్.. kisanswarajsammelan2026@Gmail.com