3, ఫిబ్రవరి 2026, మంగళవారం

మైసూరులో కిసాన్ స్వరాజ్ సమ్మేళనం

 ఫిబ్రవరి 27 28 మార్చి ఒకటి తేదీలలో కర్ణాటకలోని మైసూరులో దక్షిణ భారత కిసాన్ స్వరాజ్ సమ్మేళనం జరగనుంది. కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ సహకారంతో అలయన్స్ ఫర్ సస్టైనబుల్ హోలిస్టిక్ అగ్రికల్చర్ ఆశా ఈ ఆరవ సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. రెండేళ్లకోసారి ఈ ఉత్సవం జరుగుతుంది .2022 లోను మైసూరులోని జరిగిన సమ్మేళనంలో తెలుగు రాష్ట్రాల నుండి 300 మంది పాల్గొన్నారు .పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతులు కార్యకర్తలు శాస్త్రవేత్తలు వినియోగదారులను ఒకచోట చేర్చి అఖిలభారత అనధికారిక పౌర స్వచ్ఛంద సేవకుల సమ్మేళనం ఇది .ప్రకృతి ,సేంద్రియ వ్యవసాయ పద్ధతులు రైతుల హక్కులు ,దేశీ వంగడాలు ,వ్యవసాయ సంస్కృతి కలల పరిరక్షణ లక్ష్యంతో చర్చగోస్టులు ,సదస్సులు నిర్వహిస్తారు .విత్తన సార్వభౌమత్వం ,గడ్డి మందులను తట్టుకునే జన్యు మార్పిడి పంటలు, కలుపు యాజమాన్యం వ్యవసాయంలో శ్రమశక్తి ,అడవి జంతువులతో పంటలకు ముప్పును తట్టుకుని నిలబడడం ఎలా? ఇలాంటి అంశాలపై లోతైన చర్చ జరుగుతుంది. 

పాల్గొనదలచిన వారు..

 ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. మూడు రోజులకు వసతి ,భోజనం అన్నీ కలిపి రైతులు విద్యార్థులకు 1500 రూపాయలు, మహిళా రైతులకు 800 రూపాయలు ఇతరులకు 2500 నుండి 3500.

 చివరి తేదీ ..

ఫిబ్రవరి 15 ,2026 .

ఇతర వివరాలు ..810 55 798 39 

ఇమెయిల్.. kisanswarajsammelan2026@Gmail.com

హైదరాబాదులో రైతు బడి అగ్రి షో

 రైతులకు సరికొత్త నూతన వ్యవసాయ యంత్ర పరికరాలు ఆధునిక సాగు పద్ధతులను పరిచయం చేసే లక్ష్యంతో రైతు బడి అగ్రి షో పేరుతో భారీ వ్యవసాయ ప్రదర్శన జరగనున్నది. హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఫిబ్రవరి 20 21 22 తేదీలలో ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు రాజేందర్ రెడ్డి తెలిపారు .తమ వ్యవసాయాన్ని నవీకరించుకోవాలి అనే   ఆలోచనతో ఉన్న రైతులు కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఈ షో నిర్వహిస్తున్నామన్నారు . 500కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని అనేక ప్రాంతాల నుంచి లక్ష మంది కి పైగా రైతులు ఈ కార్యక్రమాన్ని సందర్శించే అవకాశం ఉందని అన్నారు .

వివరాలకు 88971 19694.

www.rbagrishow.com

27, మార్చి 2024, బుధవారం

పాల దిగుబడి కి ఇలా చేస్తే మేలు

 రైతులకు వ్యవసాయంతో పాటు పాడి అభివృద్ధి చెందితేనే గిట్టుబాటుగా ఉంటుంది దీనికి చిన్న చిట్కాలు పాటిస్తే పశువులకు పోషకాలు అందడంతో పాల ఉత్పత్తి పెరుగుతుందని పశువైద్యాధికారి సురేష్ తెలిపారు పచ్చిగడ్డి వెండి గడ్డిని కలిపి ఇవ్వాలి. పచ్చి గడ్డిలో 90 శాతం నీరు ఉంటుంది అదే ఎండు గడ్డిలో 10% నీరు ఉంటుంది రెండు భాగాలు పచ్చి ఒక భాగం వెండి గడ్డి కలిపి అందించాలి పాలు పితికిన తర్వాత మేత వేయాలి దాదాపుడిగా అయినా లేదా నాన్న పెట్టి అయినా ఇవ్వవచ్చు అయితే నానబెట్టడం వల్ల నమ్మడానికి జీర్ణం కావడానికి సౌకర్యంగా ఉంటుంది ఆరు గంటల పాటు నానబెడితే మంచిది

22, మార్చి 2024, శుక్రవారం

కూరగాయల రైతులకు గ్లోబల్ అవకాశాలు

 ప్రణాళికలతో లాభాల సాగు ఎగుమతులపై దృష్టి పెట్టాలి సింజంట ఆసియా పసిఫిక్ విభాగాధిపతి నిశ్చింత భాటియా



తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ కూరగాయల రైతులకు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయని సరైన పద్ధతుల్లో సాగు శుద్ధి విధానాలను ఆలంపిస్తే వారు భారీ లాభాలు పొందుతారని ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించగలుగుతారని కూరగాయల విత్తన సంస్థ సింజంట ఆసియా పసిఫిక్ విభాగాధిపతి నిశ్చింత భాటి అన్నారు హైదరాబాద్ శివారులోని నూతనకల్లో తమ సంస్థ తరఫున ప్రపంచ స్థాయి మూడు అత్యాధునిక విత్తన ఆరోగ్య ప్రయోగశాల సీడ్ హెల్త్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరై హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఏమన్నారు అంటే

ప్రపంచ దేశాల్లో 70 శాతం మేర భారత్ లో 80 శాతానికి పైగా ప్రజలు కూరగాయల ఆహారాన్ని భోంచేస్తున్నారు ఆరోగ్యపరంగా కూరగాయల శ్రేష్టమైనవి వాటిని వినియోగించే వారిలో 90 శాతం మందికి అనారోగ్య సమస్యలు లేవు జంక్ ఫుడ్ తినేవారిలో 40 శాతానికి పైగా అధిక బరువు సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని అధ్యయనాలు వెల్లడించాయి నా ప్రణాళికతోనే కూరగాయల సాగును నిర్దిష్ట ప్రణాళికతో చేపట్టాలి విత్తన రకాలను ఎంచుకొని కాలానికి అనుకూలంగా పండించాలి పురుగుమందులు కొద్ది మోతాదులోని ఉపయోగించాలి కోత దశతో పాటు నిల్వ శుద్ధిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి మార్కెటింగ్ ఏకమతల పైన దృష్టి సారించాలి ఛత్తీస్గఢ్లోని రాయపూర్ రైతు ఎకరంలో 90 టన్నుల దాకా టమాటాను పండించార. దీని ద్వారా వాణిజ్య పంటల కంటే రెట్టింపు ఆదాయం వచ్చింది కరీంనగర్ కూరగాయల రైతులు లాభాలు గడిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి రైతుల్లో ఎక్కువమంది టమాటా సాగుతూ లబ్ధి పొందుతున్నారు ఇజ్రాయిల్ జర్మనీ తదితర విదేశాల్లోనూ కూరగాయల సాగుతూ రైతులు లాభాలను గడిస్తున్నారు

విత్తనాల నాణ్యత ప్రమాణికం సింజంటా భారత్ లోని అతిపెద్ద మూడు కూరగాయల విత్తన సంస్థల్లో ఒకటి ప్రపంచవ్యాప్తంగా 124 దేశాల్లోని 26 పంటలకు విత్తనాలను తయారుచేసి పంపిణీ చేస్తున్నాం తెలంగాణ ఏపీ లలో 160 విత్తన రకాలను విక్రయిస్తున్నాను. విత్తనాలను ఎక్కడికక్కడ స్థానిక రైతులతో సిద్ధం చేస్తున్నాము విత్తనాల నాణ్యతకే ప్రాధాన్యమిస్తున్నాం నిపుణులైన వారితో అన్ని రకాల జర్మినేషన్ పరీక్షలు నిర్వహించిన అనంతరమే మార్కెట్లో విక్రయిస్తున్నాం దేశంలో ఈ ఏడాది 11 మిలియన్ విత్తన ప్యాకెట్లను విక్రయించాము విత్తన రకాలపై ముందస్తు పరీక్షల కోసం అమెరికా నెదర్లాండ్స్ తో పాటు భారత్లో ల్యాబ్ను ఏర్పాటు చేశాం హైదరాబాద్ నూతనకల్లో ల్యాబ్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన విత్తన పరీక్షా కేంద్రాల్లో ఒకటి భారత్తో ఆసియా పసిఫిక్ మరియు వెలుపల సాగుదారులకు సేవలందిస్తుంది. విత్తన నాణ్యత ప్రమాణాల ద్వారా రైతులకు నమ్మకంతో పాటు లాభాలను అందించేందుకు కృషి చేస్తున్నాం అన్నారు

సాగు పెరిగింది గత ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కూరగాయల సాగు విస్తీర్ణం 10% మేరా పెరిగింది తక్కువ విస్తీర్ణంలో కొద్ది కాలంలోనే పంటలు చేతికి రావడం వల్ల రైతుల కోసం తగ్గడంతో పాటు లాభాలు వస్తున్నాయి సాధారణ పంటలతో పోలిస్తే కూరగాయల సాగుతూ నష్టపోయే వారి సంఖ్య తక్కువే ప్రపంచవ్యాప్తంగా కూరగాయల మార్కెట్ పరిమాణం 2022లో 650.25 బిలియన్ డాలర్లు దాదాపు 53 లక్షల కోట్ల రూపాయలు ఉండగా 2023లో అది 814.1 బిలియన్ డాలర్లు సుమారు 66 లక్షల కోట్ల రూపాయలకు చేరింది 2031 నాటికి అది 4914.95 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా

13, మార్చి 2024, బుధవారం

రైతు బడి వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డికి ఐ ఐ ఐ టీ డీ ఆహ్వానం

 ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈనెల 15 16 తేదీలలో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రేరణుర్షిప్ సమ్మిట్ 2024లో పాల్గొని ప్రసంగించాలని తెలుగు రైతు బడి సంస్థ వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డిని ఆహ్వానించింది ఆయన తెలుగు రైతులకు డిజిటల్ మీడియా ద్వారా వ్యవసాయ సమాచార అందిస్తున్నారు సదస్సులో వ్యవసాయం అనుబంధ రంగాలలో యువతకు ఉన్న సరికొత్త అవకాశాల గురించి వివరించాలని సంస్థ కోరింది

హైదరాబాదులో ప్రపంచ వరి సదస్సు

 జూన్ 4 నుంచి 6 వరకు నిర్వహణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 28 దేశాల నుంచి 500 మంది హాజరు అంతర్జాతీయ కామారెడ్డి సంస్థ అంతర్జాతీయ వారి పరిశోధనా సంస్థ తెలిపాంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాదులో ప్రపంచ వరి సదస్సు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు వచ్చే జూన్ 4వ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు హైదరాబాద్ లో ఈ సదస్సు జరుగుతుంది సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది సదస్సులో 28 దేశాల నుంచి దాదాపు 500 మంది శాస్త్రవేత్తలు వ్యాపార సంస్థల ప్రతినిధులు ఎగుమతి దిగుమతి దారులు విద్యావేత్తలు వ్యవసాయ పారిశ్రామికవేత్తలు వరి అనుబంధ ఉత్పత్తుల రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు అని ఆయన వివరించారు ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు తెలంగాణలో పండే వారికి పరి ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం ద్వారా డిమాండ్ కల్పించడం మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే ఈ సతస్సు ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు ఈ జతస్సులో ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్న వరి రకాలను ప్రదర్శించడమే కాకుండా వాటి ప్రాధాన్యతలను వివరిస్తారని మంత్రి తెలిపారు మన దేశం నుంచి బియ్యం ఒక కోటి 77 లక్షల 86 వేల 92 టన్నులు కాగా అందులో తెలంగాణ నుంచి కేవలం 22,498 మెట్రిక్ టన్నులేనని పేర్కొన్నారు తెలంగాణ నుంచి దాదాపు 8,000 క్వింటాళ్లు సర్టిఫైడ్ విత్తనాన్ని కూడా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని వివరించారు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం రకాల ఎగుమతులపై విధించిన నిషేధం వల్ల సన్న బియ్యం పండించిన రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాక రైతులు కొనుగోలు సెంటర్లలో అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు

10, మార్చి 2024, ఆదివారం

ఐక్యరాజ్యసమితిలో అరకు కాఫీ

 మహిళా దినోత్సవాన్ని ప్రత్యేక చర్చ గిరిజన మహిళల పాత్ర పై అభినందనలు భరతనారి శక్తి అద్భుతమని భక్తుల కితాబు

ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయలు గిరిజనులు సాగు చేసే అరకు కాఫీకి అంతర్జాతీయంగా మరో ఘనత దక్కింది ఐక్యరాజ్యసమితిలో అరకు కాఫీ పై ప్రత్యేక చర్చ జరగడంతో పాటు ప్రశంసలు లభించాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా అరకు కాఫీ ప్రయాణంపై ప్రత్యేక చర్చ జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ఐక్యరాజ్యసమితి నాయకులు అరకు కాఫీని భారత నారీ శక్తిని ప్రశంసించారు భారత అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు అన్నారు వ్యవసాయం ఆర్థిక డిజిటల్ సాంకేతికత ఆరోగ్యం విద్య అంతరిక్షం విమానాయన రంగాలలో భారత మహిళలు రాణిస్తున్నారు ప్రశంసించారు అరకు కాశీకి అంతర్జాతీయంగా పేరు రావడంలో గిరిజన మహిళలు ఎంతో కృషి చేశారని కొనియాడారు గిరిజన మహిళల విజయగాత స్ఫూర్తిదాయకమన్నారు ఈ ఏడాది జనవరిలో తాను భారత పర్యటనకు వెళ్ళినప్పుడు నారి శక్తిని ప్రత్యక్షంగా చూశానని గుర్తుచేసుకున్నారు ఆ ప్రాంత గిరిజనులకు సాధికారత గౌరవము లభించాలని వక్తలు పేర్కొన్నారు అరకు కాఫీ ఎంతో రుచిగా నాణ్యతగా ఉండేలా గిరిజనులు స్థిరమైన సాగు పద్ధతులు పాటిస్తున్నారని భారత ప్రతినిధి బృందం పేర్కొంది కాఫీ సాగు నుంచి కోత వరకు ఉత్పత్తి ప్రక్రియలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని వివరించింది.

Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE