11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

సాగునీటి సమస్య- ప్రిసిషన్ అగ్రికల్చర్

 వరి సాగుకు కొత్త విధానాన్ని కనుగొన్న ఐఐటి  మద్రాస్. తక్కువ నీటితో వరి చెరుకు పండించడమే   లక్ష్యం.

భారతీయ వరి సాగు పై జరిగిన ఒక వివరనాత్మక అధ్యయనం ప్రకారం.. ఒక కిలో బియ్యం పండించడానికి సగటు న 1500 నుండి 2000 లీటర్ల నీరు అవసరం. వర్షాల పై ఆధారపడకుండా భూగర్భ జలాలని విపరీతంగా తోడేసే పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలలో ఈ కిలో బియ్యానికి 2270 నుంచి 2672 లీటర్ల వరకు అవసరమవుతుంది. భారతదేశం ఉపయోగించే మొత్తం మంచినీటి లో దాదాపు 90 శాతం వ్యవసాయానికే ఖర్చవుతుంది. చెరకు పంటకు కూడా భూమి ఎప్పుడూ తడిగానే ఉండాలి. భారతదేశపు అత్యున్నత సాంకేతిక సంస్థలలో ఒకటైన ఐఐటీ మద్రాస్ లో ఒకరు ఈ సమస్య వైపు దృష్టి సారించారు. ఐఐటి  మద్రాస్ "ప్రిసిషన్ అగ్రికల్చర్ " అని పిలిచే విధానంపై దృష్టి సారిస్తున్నదని ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి తెలిపారు. తక్కువ నీటిని ఉపయోగిస్తూ వరి, చేరుకు  వంటి పంటలను పండించడమే ఈ ఖచ్చితత్వ వ్యవసాయం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. 

"మిషన్ ప్రవర్తక్ " అనేది ఐఐటి మద్రాస్ సొంత టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ .సెన్సార్లు ,నెట్వర్క్, కంట్రోల్ సిస్టంలు దీని ప్రధాన రంగాలు .ఖచ్చితత్వ వ్యవసాయం రూపుదిద్దుకోవడానికి సరిగ్గా ఈ సాంకేతికలే అవసరం."ప్రిసిషన్ అగ్రికల్చర్ " కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా ఉపయోగించాలో కెనడా భాగస్వాములతో కలిసి ప్రవర్తక్ ఇప్పటికే ఉమ్మడి వర్క్ షాప్ లను నిర్వహించింది. ప్రిసిషన్ అగ్రికల్చర్ అంటే ఒక్క మొక్కకు ఎంత అవసరమో అంతే ఇవ్వడం. ఒక బొట్టు కూడా ఎక్కువ ఇవ్వకపోవడం. ఆచరణలో మూడు అంశాలు కలిసి పనిచేస్తాయి. నేలలో పాతిపెట్టిన సెన్సార్లు తేమను కొలుస్తాయి, రైతు ఊహించి నీరు పెట్టడానికి బదులుగా ,పంటకు ఎప్పుడు దాహం వేస్తుందో నేలే చెబుతుంది. పొలమంతా నీటితో ముంచెత్తి వృధా చేయకుండా  ,మొక్క వేర్లకు ఎంత కావాలో అంతే కొలత ప్రకారం చుక్కల రూపంలో నీటిని అందిస్తుంది. పై నుండి నిఘా ఉంచే శాటిలైట్ లు ,డ్రోన్లు పొలంలో ఏ భాగం పైరు సరిగ్గా పెరగడం లేదో ముందే పసి గడుతాయి. వరి విషయానికి వస్తే ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్  డ్రైయింగ్ అనే పద్ధతి ద్వారా అంటే పొలాన్ని ఎల్లప్పుడూ నీటిలో ఉంచకుండా ,నీరు పెట్టిన తర్వాత కొద్దిగా ఆరనివ్వడం ద్వారా దిగుబడి తగ్గకుండా నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించ వచ్చని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిరూపించారు. మారుతున్న వాతావరణం , పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పంటలకు నీటి దాహం మరింత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఖచ్చితత్వ వ్యవసాయం అనేది భారత్ కు ఎంతో అవసరం. తగ్గిపోతున్న నీటి వనరులతో భవిష్యత్తులో భారత్ తనకు తాను ఆహారాన్ని అందించుకోగలదా లేదా అనే దానికి ఇది సమాధానం. 

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

ఆయిల్ పామ్ తోటలో.. ఏ ఐ రోబో

 కృత్రిమ మేధ ఆధారిత యంత్ర పరికరాల పై పరిశోధన లు విస్తృతంగా చేస్తున్నట్లు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. డీ. రాజిరెడ్డి గారు తెలిపారు. రాజేంద్ర నగర్ లోని ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ లో ఇటీవల నాటిన నూతన ఆయిల్ పామ్ తోటలో అంతర పంటల వరుసల మార్కింగ్ కోసం ఏ ఐ రోబో ట్రయల్ రన్ ను గురు వారం విజయ వంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆయిల్ పామ్ తోటలో కూర గాయలు, పూలు వంటి అంతర పంటల సాగు ను యంత్రాల సహాయంతో విజయ వంతంగా సరి చేయడమే ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. 

16, ఆగస్టు 2026, ఆదివారం

ఇది ఆకు కూరల జాతర..

 పాలకూర ,తోటకూర ,మెంతికూర ,పొన్నగంటి కూర ఇవన్నీ మనకు తెలిసిన ఆకుకూరలు. పొలాల్లో విత్తనాలు చల్లితే సాగుతాయి. కానీ విత్తనాలు చల్లడం, నీరు పెట్టాల్సిన అవసరం లేకుండానే పంట పొలాల్లో కలుపు మొక్కలుగా పెరిగే ఆకుకూరలు కూడా చాలా రకాలు ఉన్నాయి. సహజ సిద్ధంగా పంట పొలాల్లో పెరిగే జొన్న చెంచాలి కూర, ఎలుక చెవుల కూర ,అడవి సోయకూర, తెల్ల గర్జల కూర, బంకటి కూర ,తడకదొబ్బుడు, పప్పు గునగ కూర ,ఉత్తరేణి ,తుమ్మి కూర ఇలాంటి ఎన్నో ఆకుకూరలు పంట పొలాల్లో కలుపు మొక్కలుగా పెరుగుతుంటాయి.  తెలిసినవారు వీటిని బేషుగ్గా వండుకొని తింటారు .జహీరాబాద్రు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ కలుపు కూరలను పోషకాల గనులుగా భావించి తింటుంటారు. ఈ ప్రాంతంలోని పంట పొలాల్లో సహజ సిద్ధంగా లభించే 60కి పైగానే ఉన్న ఆకు కూరలను జాతీయ పోషకాహార సంస్థలో పరీక్ష చేయించగా వీటిలో అధిక మొత్తంలో పోషకాలు ఉన్నాయని తేలింది. ఈ ఆకుకూరల ప్రత్యేకతను చాటేందుకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ- కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో" సాగు చేయని ఆకుకూరల పండుగను " ఏటా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో ఆకుకూరలు వండే విధానం ,తినడం వల్ల కలిగే ప్రయోజనాలను నిపుణులతో తెలియజేస్తారు. జహీరాబాద్ మండలం దిడ్గి  గ్రామ శివారులోని డిడిఎస్ కేవీకే కేంద్రంలో ఆదివారం ఒక్కరోజు ఉత్సవం జరగనున్నది. ఈ క్రతువుకు పలువురు శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు హాజరవుతారు. కాలానుగుణంగా దొరికే ఆకుకూరలు వండుకొని తింటే పోషకాలు సమృద్ధిగా అందుతాయని, ఇవి అద్భుత ఔషధాలనీ డీ డీ ఎస్ మహిళా ప్రతినిధులు, మహిళా రైతులు పేర్కొంటున్నారు. 



పల్లెలో పాల పంపకం..

 పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి కుటుంబమూ పాల ప్యాకెట్ కొనుగోలు తప్పని సరి అయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఊరిలో పాల ప్యాకెట్ కొనడం మచ్చుకైనా కనిపించదు. 

ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ మండలం అల్లికోరి పంచాయతీ లోని పొటంలొద్ది ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ 50 కుటుంబాలే ఉన్నప్పటికీ 250 కి పైగా పశువులు,మేకలు ఉన్నాయి. ఈ పశు సంపద ను పాకలకే పరిమితం చేయకుండా వాటిని ఇంట్లో కూడా స్వేచ్ఛగా తిరగనిస్తూ ఆప్యాయంగా చూసుకుంటారు ఆ గ్రామ వాసులు. వీటి నుండి ఎంత పాల దిగుబడి వచ్చినా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు తప్ప చుక్క కూడా మార్కెట్ లో విక్రయించరు.

పైగా ఈ పశువుల మూత్రం ,పేడతో స్వయంగా సేంద్రీయ ఎరువులను తయారు చేసుకొని ,పంటలు సాగు చేసుకుంటున్నామని ..తమ ఊరిలో కృత్రిమ ఎరువుల వాడకం తక్కువ అని గ్రామ పెద్ద గంగు తెలిపారు.

7 నిమిషాల్లోనే చెఱకు రసం శుద్ధి

 చెఱకు రసం శుద్ధి చేసే పరికరాన్ని ఆవిష్కరించిన ది ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్ కు 20 ఏళ్ల కాల పరిమితితో ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. ఆంధ్రా షుగర్స్ జే ఎం డీ ముళ్ళపూడి నరేంద్ర నాథ్ మార్గ దర్శకత్వంలో పరికరాల అభివృద్ధి బృందం ఈ యంత్రాన్ని తయారు చేసింది. కేవలం 7 నిమిషాల్లోనే చెఱకు రసాన్ని శుద్ధి చేయడం దీని ప్రత్యేకత అని యాజమాన్యం తెలిపింది. 

24, మే 2026, ఆదివారం

చేపల పెంపకం పై మూడు రోజుల శిక్షణ శిక్షణ

 నేషనల్ ఫిషరీస్ ఆధ్వర్యంలో ఈనెల 28 29 30 తేదీలలో మంచిర్యాలలో ఏర్పాటు..

మత్స్యకారులను రైతులను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 28 29 30 తేదీలలో మత్స్యకారులకు చేపల పెంపకం పై ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన 50 మంది మత్స్యకారులను ఎంపిక చేశారు. మత్స్యకారులకు శాస్త్రీయ పద్ధతుల్లో చేపల పెంపకం పై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు. చేపల పెంపకం ఉత్పాదకను ఎలా పెంచాలి? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. వీటితోపాటు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కొర్రమీను/స్నేక్ హెడ్ పెంపకం, యాజమాన్య పద్ధతులపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తారు. జాతీయస్థాయి మత్సరంగ శాస్త్రవేత్తలు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అధికారులు హాజరై మత్స్యకారులు రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తారు. ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని మత్స్యకారులు రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని అధికారులు కోరారు.

తిరుపతిలో పాలేకర్ శిక్షణ శిబిరం

 ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఐదు రోజుల శిక్షణ శిబిరం ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించనున్నారు.

ఈ ఐదు రోజుల రెసిడెన్షియల్ రైతు శిక్షణ శిబిరం జూన్ 10 నుండి 14వ తేదీ వరకు జరగనున్న ది. పాలేకర్ ఆంగ్ల ప్రసాద్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఉంటుంది. స్వచ్ఛంద సేవకులు డాక్టర్ గంగాధర్ విజయ్ రామ్, పారిశ్రామిక వేత్త రామలింగారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని తిరుపతి చంద్రగిరి రోడ్ లోని ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు.హాజరయ్యే రైతులకు హాస్టల్ హెచ్ లో వసతి కల్పించ నున్నారు. గ్రామ స్వరాజ్యం, విష ముక్త, రోగ ముక్త ఆహారోత్పత్తి లక్ష్యంగా సుభాష్ పాలేకర్ కృషి SPK పద్ధతిలో ఇమిడి ఉన్న అన్ని అంశాలపై పాలేకర్ రోజుకు 12 గంటల పాటు లోతుగా శిక్షణ ఇస్తారు.5 రోజులు భోజన,వసతికి 1500 రూపాయలు చెల్లిస్తే చాలు.ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పని సరి.

పూర్తి వివరాలకు 96669 11116,94924 84003,93475 78819 ఫోన్ నెంబర్ లలో సంప్రదించ ాలని తెలిపారు.

Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE