ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఐదు రోజుల శిక్షణ శిబిరం ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించనున్నారు.
ఈ ఐదు రోజుల రెసిడెన్షియల్ రైతు శిక్షణ శిబిరం జూన్ 10 నుండి 14వ తేదీ వరకు జరగనున్న ది. పాలేకర్ ఆంగ్ల ప్రసాద్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఉంటుంది. స్వచ్ఛంద సేవకులు డాక్టర్ గంగాధర్ విజయ్ రామ్, పారిశ్రామిక వేత్త రామలింగారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని తిరుపతి చంద్రగిరి రోడ్ లోని ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు.హాజరయ్యే రైతులకు హాస్టల్ హెచ్ లో వసతి కల్పించ నున్నారు. గ్రామ స్వరాజ్యం, విష ముక్త, రోగ ముక్త ఆహారోత్పత్తి లక్ష్యంగా సుభాష్ పాలేకర్ కృషి SPK పద్ధతిలో ఇమిడి ఉన్న అన్ని అంశాలపై పాలేకర్ రోజుకు 12 గంటల పాటు లోతుగా శిక్షణ ఇస్తారు.5 రోజులు భోజన,వసతికి 1500 రూపాయలు చెల్లిస్తే చాలు.ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పని సరి.
పూర్తి వివరాలకు 96669 11116,94924 84003,93475 78819 ఫోన్ నెంబర్ లలో సంప్రదించ ాలని తెలిపారు.