16, ఆగస్టు 2026, ఆదివారం

ఇది ఆకు కూరల జాతర..

 పాలకూర ,తోటకూర ,మెంతికూర ,పొన్నగంటి కూర ఇవన్నీ మనకు తెలిసిన ఆకుకూరలు. పొలాల్లో విత్తనాలు చల్లితే సాగుతాయి. కానీ విత్తనాలు చల్లడం, నీరు పెట్టాల్సిన అవసరం లేకుండానే పంట పొలాల్లో కలుపు మొక్కలుగా పెరిగే ఆకుకూరలు కూడా చాలా రకాలు ఉన్నాయి. సహజ సిద్ధంగా పంట పొలాల్లో పెరిగే జొన్న చెంచాలి కూర, ఎలుక చెవుల కూర ,అడవి సోయకూర, తెల్ల గర్జల కూర, బంకటి కూర ,తడకదొబ్బుడు, పప్పు గునగ కూర ,ఉత్తరేణి ,తుమ్మి కూర ఇలాంటి ఎన్నో ఆకుకూరలు పంట పొలాల్లో కలుపు మొక్కలుగా పెరుగుతుంటాయి.  తెలిసినవారు వీటిని బేషుగ్గా వండుకొని తింటారు .జహీరాబాద్రు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ కలుపు కూరలను పోషకాల గనులుగా భావించి తింటుంటారు. ఈ ప్రాంతంలోని పంట పొలాల్లో సహజ సిద్ధంగా లభించే 60కి పైగానే ఉన్న ఆకు కూరలను జాతీయ పోషకాహార సంస్థలో పరీక్ష చేయించగా వీటిలో అధిక మొత్తంలో పోషకాలు ఉన్నాయని తేలింది. ఈ ఆకుకూరల ప్రత్యేకతను చాటేందుకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ- కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో" సాగు చేయని ఆకుకూరల పండుగను " ఏటా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో ఆకుకూరలు వండే విధానం ,తినడం వల్ల కలిగే ప్రయోజనాలను నిపుణులతో తెలియజేస్తారు. జహీరాబాద్ మండలం దిడ్గి  గ్రామ శివారులోని డిడిఎస్ కేవీకే కేంద్రంలో ఆదివారం ఒక్కరోజు ఉత్సవం జరగనున్నది. ఈ క్రతువుకు పలువురు శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు హాజరవుతారు. కాలానుగుణంగా దొరికే ఆకుకూరలు వండుకొని తింటే పోషకాలు సమృద్ధిగా అందుతాయని, ఇవి అద్భుత ఔషధాలనీ డీ డీ ఎస్ మహిళా ప్రతినిధులు, మహిళా రైతులు పేర్కొంటున్నారు. 



పల్లెలో పాల పంపకం..

 పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి కుటుంబమూ పాల ప్యాకెట్ కొనుగోలు తప్పని సరి అయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఊరిలో పాల ప్యాకెట్ కొనడం మచ్చుకైనా కనిపించదు. 

ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ మండలం అల్లికోరి పంచాయతీ లోని పొటంలొద్ది ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ 50 కుటుంబాలే ఉన్నప్పటికీ 250 కి పైగా పశువులు,మేకలు ఉన్నాయి. ఈ పశు సంపద ను పాకలకే పరిమితం చేయకుండా వాటిని ఇంట్లో కూడా స్వేచ్ఛగా తిరగనిస్తూ ఆప్యాయంగా చూసుకుంటారు ఆ గ్రామ వాసులు. వీటి నుండి ఎంత పాల దిగుబడి వచ్చినా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు తప్ప చుక్క కూడా మార్కెట్ లో విక్రయించరు.

పైగా ఈ పశువుల మూత్రం ,పేడతో స్వయంగా సేంద్రీయ ఎరువులను తయారు చేసుకొని ,పంటలు సాగు చేసుకుంటున్నామని ..తమ ఊరిలో కృత్రిమ ఎరువుల వాడకం తక్కువ అని గ్రామ పెద్ద గంగు తెలిపారు.

7 నిమిషాల్లోనే చెఱకు రసం శుద్ధి

 చెఱకు రసం శుద్ధి చేసే పరికరాన్ని ఆవిష్కరించిన ది ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్ కు 20 ఏళ్ల కాల పరిమితితో ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. ఆంధ్రా షుగర్స్ జే ఎం డీ ముళ్ళపూడి నరేంద్ర నాథ్ మార్గ దర్శకత్వంలో పరికరాల అభివృద్ధి బృందం ఈ యంత్రాన్ని తయారు చేసింది. కేవలం 7 నిమిషాల్లోనే చెఱకు రసాన్ని శుద్ధి చేయడం దీని ప్రత్యేకత అని యాజమాన్యం తెలిపింది. 

Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE